దైవానికి దగ్గర కావడానికి అలా చేయవలసిందేనా?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (22:13 IST)
అంతఃచేతనలో పూర్తిగా పరమాత్మ స్వరూపం నిండిన తరువాత కూడా మహర్షులు, యోగులు, సిద్దులు మహనీయులైన మన పూర్వికులు స్వధర్మాచరణను విడిచి పెట్టలేదు. ఆధునిక కాలంలో ఈ ధర్మాచరణ పట్ల సరైన అవగాహన లేక, అలా అవగాహన కల్పించేవారు లేక పొందాల్సిన జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. 
 
నవవిధ భక్తులలో మొదటిది అర్చన. కొందరు పరమాత్మ గుణ గాన సంకీర్తనాన్ని ఎంచుకుని తరించారు. ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్న ఆ మార్గాలన్నింటి లక్ష్యం పరమాత్మని చేరుకోవడమే. మనసులో కల్మషం నింపుకుని ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు. మనసు నిర్మలంగా సర్వ భూత హితకారియై ఉన్నప్పుడు, నిరంతరం పరమాత్మలో లీనమై చరించేటప్పుడు ఏలాంటి పూజలు చేయకపోయినా ఫరవాలేదు. ఆ స్థితికి చేరుకోవడం చాలా కష్టం. 
 
కానీ... అలా చేరుకున్నప్పటికీ స్వధర్మానుష్టానాన్ని విడిచిపెట్టుకోవడం మాత్రం ఏ మాత్రం మంచిది కాదు. మీరు చేసే పూజలు, పునస్కారాలు మిమ్మల్ని ధర్మమార్గంలో పట్టి నిలిపి ఉంచుతాయి. ధార్మిక చింతనల వలన మీ మదిలో చెడు ఆలోచనలు రావు. ఆ నిష్ట చెదరకుండా ఎప్పటికి నిలచి ఉండడానికి ఆధ్యాత్మిక దివ్య సాధనలో మీరు మరింతగా పురోగమించడానికి పరిపూర్ణంగా పరమాత్మ సాక్షాత్కారం కలగడానికి ఆ పూజలు ఖచ్చితంగా దోహదపడతాయి. మనసు పరమాత్మలో పూర్తిగా లీనమై ఉన్నప్పుడు మాట కూడా మంత్రం అవుతుంది. దృష్టి ప్రాపంచిక విషయాలపై ఉన్నప్పుడు మంత్రం కూడా మాట లాగే వినపడుతుంది. ఈ రెండిటికి మధ్య భేదాన్ని గుర్తించగలిగే స్థాయి పరిణతి చాలా అవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

లేటెస్ట్

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments