Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో టిక్కెట్ల స్కామ్.. ఏం దోచుకుంటున్నారో తెలుసా? ప్రోటోకాల్ దర్శనం.. రూ.50వేలు! (video)

సెల్వి
గురువారం, 16 జనవరి 2025 (13:02 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన లడ్డూ వివాదం సంచలనం సృష్టించింది. భారీ సంపన్న ఆలయంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతిరోజూ లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. ఆయనకు భారీగా కానుకలు ఇస్తుంటారు. దీంతో హుండీ ఆదాయం భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆభరణాలను తితిదే బోర్డులో పనిచేసే ఓ అధికారి ఇటీవల దొంగలించినట్లు వార్తలొచ్చాయి. 
 
తాజాగా తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల మోసం వెలుగులోకి వచ్చింది. కొందరు దళారులు నకిలీ టికెట్ల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో అడుగడుగునా అవినీతి తాండవం చేస్తోంది.  అనుమానం వచ్చిన తితిదే విజిలెన్స్‌ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను నిలిపి విచారణ చేపట్టారు. విచారణలో ఈ మోసానికి సంబంధించి ఐదుగురు నిందితులు బయటపడ్డారు. 
 
వీరిలో లక్ష్మీపతి (రూ.300 టికెట్ల కౌంటర్ ఉద్యోగి), మణికంఠ (అగ్నిమాపక శాఖ సిబ్బంది), భానుప్రకాశ్ (అగ్నిమాపక శాఖ సిబ్బంది), టాక్సీ డ్రైవర్లు శశి (తిరుపతి), జగదీశ్‌ (చెన్నై) ఉన్నారు. విజిలెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, టాక్సీ డ్రైవర్లు భక్తులను సేకరించి, నకిలీ టికెట్ల ద్వారా దర్శనం చేయించేవారు. 
 
ఈ క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనం: రూ.25,000
ప్రోటోకాల్ దర్శనం: రూ.50,000
ఉద్యోగుల దర్శనం: రూ.10,000 - రూ.15,000లు దోచుకుంటున్నారు. 
 
ఈ స్కామ్ వివరాలు వెలుగులోకి రావడంతో దయచేసి ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుని తిరుమల పవిత్రతను కాపాడాలని.. విశ్వాసాన్ని నిలబెట్టాలని భక్తులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments