పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మసలుకోవాలంటే?

మిత్రులతో మాట్లాడడంలో ఏముంది ఎవరైనా మాట్లాడుతారు. అదేవిధంగా తలిదండ్రులతో కూడా మాట్లాడాలి. మరీ బాల్యంలో కాకపోయినా ఓ పన్నెండు, పదమూడేళ్లు వచ్చాకయినా ఆ దిశగా వెళ్లాలి. లేదంటే ఎప్పటికీ భయం భయంగ దూరదూరంగా

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (15:20 IST)
మిత్రులతో మాట్లాడడంలో ఏముంది ఎవరైనా మాట్లాడుతారు. అదేవిధంగా తలిదండ్రులతో కూడా మాట్లాడాలి. మరీ బాల్యంలో కాకపోయినా ఓ పన్నెండు, పదమూడేళ్లు వచ్చాకయినా ఆ దిశగా వెళ్లాలి. లేదంటే ఎప్పటికీ భయంభయంగా దూరదూరంగా ఉండాల్సి వస్తుంది. పెద్దవాళ్లంటే ప్రేమ, భయం, గౌరవం ఉండాలి. పెద్దవాళ్లతో పిల్లలు తాముగా మాట్లాడేది ఏమీ వుండకపోవచ్చు.
 
కానీ, వాళ్లు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినగలితే చాలు ఏవో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. తమ పిల్లలతో పరమ గంభీరంగా ఉండే తలిదండ్రులు కూడా వేరే వాళ్ల పిల్లలతో చాలా చనువుగా, ఆత్మీయంగా ఉంటారు. ఈ విషయం తెలియక తమ పిల్లలతో సీరియస్‌గా ఉండేవాళ్లు మిగతా పిల్లలతో కూడా అంతే సీరియస్‌గా ఉంటారని పొరబడుతుంటారు.
 
ఎప్పుడో ఒకసారి వాళ్లతో మాట్లాడితే గానీ అసలు విషయం తెలిసి రాదు. కొంతమంది తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన విషయాలను నేరుగా తమ పిల్లలతో చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్లలో కొందరు పరోక్షంగా వాళ్ల మిత్రులతో చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ వైఖరి దాదాపు తల్లిదండ్రులు అందరిలోనూ ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్లతో చనువుగా ఉండడం వలన మిత్రులు ఇరువురికీ కలిగే ఒక అదనపు సౌకర్యమిది.
 
కానీ, వీరి వ్యాఖ్యాలకు వాళ్ల వ్యక్తిత్వానికి ఎక్కడా పొంతన ఉండదు. పిల్లలకు ఇదే పెద్ద అనుభవం. ఇలాంటివన్నీ సమాజంలో ఒకే వ్యక్తి మీద రెండు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యాలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో పిల్లలకు బాల్యంలోనే తెలియచెబుతాయి. దీనివలన మునుముందు సమాజంలో ఎలా మసలుకోవాలో, ఒక వ్యక్తికి సంబంధించిన నిజానిజాల విషయంలో ఎలా ఒక అభిప్రాయానికి రావాలో ఎంతో కొంత బోధపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మహిళలకు రూ.2 వేలు, ఒక ఇంటికి రూ.10 వేలు, మూడు పండుగలకు మూడు సిలిండర్లు ఫ్రీ... బీజేపీ మేనిఫెస్టో

నారీ శక్తి వందన్‌కు మద్దతు ఇవ్వండి : టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ

చెరువులో కాలేజీ కట్టిన ఓవైసీ... కూల్చే దమ్ములేక పారిపోయిన హైడ్రా అధికారులు

ఇపుడే ఏం కాలేదు.. ముందుంది మొసళ్ళ పండుగ : అమెరికా మంత్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: యువతరాన్ని హెచ్చరిస్తూ పిఠాపురంలో చిత్రం సిద్ధమైంది

మళ్లీ మనం కలిసేంత వరకు నువ్వు ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు : కుమార్తె మృతిపై చిత్ర ట్వీట్

Balakrishna: జో శర్మా నటించిన ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

సముద్ర తీరాన మత్స్యకారులతో కలిసిపోయి తెరచాప చిత్రీకరించాం : నవీన్ రాజ్

Ram Charan: సుల్తాన్, దంగల్' చిత్రాల జాతీయ కోచ్ వద్ద పెద్ది కోసం శిక్షణ తీసుకున్నా : రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments