కంటిచూపుతోనే మగాళ్లను అంచనా వేసేస్తున్న యువతులు.. ఆ శక్తి పెరిగిపోతుందట..

మగాళ్లను పసిగట్టడంలో మహిళలు బాగా ఆరితేరిపోతున్నారని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి మహిళల్లో పెరిగిపోతోందని ఆ పరిశోధనలో వెల్లడైంది. తమతో చనువుగ

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (12:53 IST)
మగాళ్లను పసిగట్టడంలో మహిళలు బాగా ఆరితేరిపోతున్నారని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి మహిళల్లో పెరిగిపోతోందని ఆ పరిశోధనలో వెల్లడైంది. తమతో చనువుగా ఉంటున్న మగవారి మనసులో ఏ ఉద్దేశం ఉందో యువతులు తేలిగ్గా పసిగట్టేస్తున్నారని.. మగవారి మాటలను, కంటిచూపును పరిశీలించడం ద్వారా వారు ఎలాంటి వారో ఓ అంచనాను వచ్చేస్తున్నారని కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరిశోధనలో తేలింది.
 
తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అతి నిశితంగా పరిశీలించడం.. రోజువారీ సంఘటనల ఆధారంగా ఆడవారిలో అంచనా శక్తి  పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలే వారి అంచనా శక్తిని పెంచేందుకు కారణమవుతుందని పరిశోధకులు అంటున్నారు.
 
పురుషులు ఎలాంటి వారో వారి చూపులు.. ఆలోచనల బట్టి మహిళలు తెలుసుకుంటున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా 89వేల మందిపై జరిగిన ఈ సర్వేలో 50 శాతం మంది మ‌హిళ‌లు ఎదుటివారి చూపుల ద్వారా వారి ఆలోచనల్ని తేలిక‌గా కనిపెట్టేయగలిగారని పరిశోధకులు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భూమికి చాలా దగ్గరగా వెళ్లనున్న ఆర్టెమిస్ వ్యోమగాములు.. అది జరిగికే రికార్డే

ఇరాన్‌లోని 200కు పైగా స్థావరాలపై ఇజ్రాయేల్ దాడులు

ఉత్తరప్రదేశ్ ఇటావాలో వచ్చి పడిన క్షిపణి... వామ్మో, అది ఇరాన్ నుంచి వచ్చిందా? (video)

మహిళలను బలహీనులుగా చిత్రీకరించవద్దు.. పెద్ద కుర్చీని వద్దన్న నారా లోకేష్

ఐఎంటి హైదరాబాద్‌లో వేడుకగా జరిగిన 2026 బ్యాచ్ స్నాతకోత్సవం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

తర్వాతి కథనం
Show comments