Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్వం శివునికి ప్రీతికరం ఎలా అయ్యింది..

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (19:01 IST)
పాలకడలిలో శయనిస్తున్న విష్ణుమూర్తిని తన పతిగా చేసుకునేందుకు శ్రీ మహాలక్ష్మీ సంకల్పించుకుంది. విశ్వమూర్తి అయిని విష్ణువు వక్ష స్థలంలో కొలువై వుండాలని భావించింది. త్రిలోకి అనే ప్రాంతంలో మహేశ్వరుడిని తలచి తపస్సు చేపట్టింది. అక్కడ వెలసిన త్రిలోక్యా సుందరుడిని పూజించాలని.. విష్ణుమూర్తిని పొందాలని శ్రీ లక్ష్మి తలచింది. 
 
ఆ సమయంలో ఈశ్వరుడిని ఎలా పూజించాలో తెలియక ఆమె పరిపరివిధాలుగా ఆలోచించింది. ఆమెకు ఏమీ తోచలేదు. చివరికి ఆమె ప్రాణాన్ని త్యాగం చేయాలని బావించింది. లక్ష్మీదేవి ఆమె ప్రాణాన్ని మూడు భాగాలుగా చేసి.. ఈశ్వరుడి అనుగ్రహం పొందింది. శివానుగ్రహంతో ఆమె సంకల్పం సిద్ధించింది. 
 
అలా మహాలక్ష్మీ కూర్చున్న ప్రాంతంలో అద్భుతం జరిగింది. పచ్చని ఆకులతో కొండ వెలసింది. ఆ ప్రాంతంలో బిల్వం మొలిచింది. ఆమె ప్రాణశక్తిని మూడుగా విభజించడంతో బిల్వ పత్రం మూడు ఆకులుగా మొలిచింది. ఆపై ఏకరూపం దాల్చింది. అలా బిల్వ పత్రం ఏర్పడింది. 
 
శివునికి ప్రీతికరంగా మారింది. అందుకే బిల్వ అర్చనతో అనుకున్నది సాధించగలుగుతారు. బిల్వం మహాలక్ష్మీ స్వరూపం. ఆమె అనుగ్రహం కోసం బిల్వంతో శివుడిని పూజిస్తే చాలునని కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

తర్వాతి కథనం