Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్వం శివునికి ప్రీతికరం ఎలా అయ్యింది..

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (19:01 IST)
పాలకడలిలో శయనిస్తున్న విష్ణుమూర్తిని తన పతిగా చేసుకునేందుకు శ్రీ మహాలక్ష్మీ సంకల్పించుకుంది. విశ్వమూర్తి అయిని విష్ణువు వక్ష స్థలంలో కొలువై వుండాలని భావించింది. త్రిలోకి అనే ప్రాంతంలో మహేశ్వరుడిని తలచి తపస్సు చేపట్టింది. అక్కడ వెలసిన త్రిలోక్యా సుందరుడిని పూజించాలని.. విష్ణుమూర్తిని పొందాలని శ్రీ లక్ష్మి తలచింది. 
 
ఆ సమయంలో ఈశ్వరుడిని ఎలా పూజించాలో తెలియక ఆమె పరిపరివిధాలుగా ఆలోచించింది. ఆమెకు ఏమీ తోచలేదు. చివరికి ఆమె ప్రాణాన్ని త్యాగం చేయాలని బావించింది. లక్ష్మీదేవి ఆమె ప్రాణాన్ని మూడు భాగాలుగా చేసి.. ఈశ్వరుడి అనుగ్రహం పొందింది. శివానుగ్రహంతో ఆమె సంకల్పం సిద్ధించింది. 
 
అలా మహాలక్ష్మీ కూర్చున్న ప్రాంతంలో అద్భుతం జరిగింది. పచ్చని ఆకులతో కొండ వెలసింది. ఆ ప్రాంతంలో బిల్వం మొలిచింది. ఆమె ప్రాణశక్తిని మూడుగా విభజించడంతో బిల్వ పత్రం మూడు ఆకులుగా మొలిచింది. ఆపై ఏకరూపం దాల్చింది. అలా బిల్వ పత్రం ఏర్పడింది. 
 
శివునికి ప్రీతికరంగా మారింది. అందుకే బిల్వ అర్చనతో అనుకున్నది సాధించగలుగుతారు. బిల్వం మహాలక్ష్మీ స్వరూపం. ఆమె అనుగ్రహం కోసం బిల్వంతో శివుడిని పూజిస్తే చాలునని కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

లేటెస్ట్

వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో..?

06-09-2024 శుక్రవారం రాశిఫలాలు - మీ కష్టం ఫలిస్తుంది.. ఉల్లాసంగా గడుపుతారు...

వినాయక చవితి 2024: 21 పత్రాలు.. ఎరుపు రంగు దుస్తులు..?

నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

05-09-2024 గురువారం దినఫలితాలు - ఆ రాశివారికి ఖర్చులు సామాన్యం..

తర్వాతి కథనం