Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (14:25 IST)
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ నెల 8 నుంచి నిబంధనలతో కూడిన దర్శనాలకు టీటీడీ అమమతి ఇచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
రోజుకు పదివేల మందికి 16 గంటల నుంచి 18 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. గంటకు 500 మందిని దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. తిరుమల,తిరుపతిలో ఉన్న స్థానికులకు రెండు వారాల పాటు దర్శనానికి ఇవ్వనున్నారు.
 
ప్రస్తుతానికి స్థానికులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నారు. స్ధానికులతో ట్రయల్ రన్ విజయవంతం అయితే క్రమంగా చిత్తూరు జిల్లా వాసులకు, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు అమనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. 
 
ఇక భక్తులు ఖచ్చితంగా ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. భక్తుల దర్శనానికి గాను అనుమతించాలని కోరుతూ టీటీడీ ఎగ్జ్సిక్యూటివ్ అధికారి రాసిన లేఖ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్... అందుకు అనుమతిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

Tapeswaram: తాపేశ్వరం లడ్డూల తయారీకి పూర్వ వైభవం.. గణేష్ పండల్ నుంచి ఆర్డర్లు

TTD: మోసాలకు అడ్డుకట్ట: భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌

తర్వాతి కథనం
Show comments