Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యగ్రహణంతో ఈ రాశుల వారికి తలనొప్పి.. వృశ్చిక రాశి జాతకులు మైసూర్ పప్పును..?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (16:54 IST)
జూన్ 21, ఆదివారం నాడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 10.25 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకు ఈ గ్రహణం వుంటుంది. గ్రహణ పట్టు, విడుపుల సమయం మధ్య పగలు తీసుకునే ఆహారాన్ని తీసుకోకుంటేనే మంచిదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఈ గ్రహణాన్ని వృషభ, మిధున రాశుల వారు చూడకుండా ఉండాలని సలహా ఇచ్చారు. 
 
జన్మ నక్షత్రాల పరంగా మృగశిర, ఆరుద్ర, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈ గ్రహణం కీడును కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట తదితర పుణ్యక్షేత్రాల్లోని ఆలయాలను కూడా మూసివేయనున్నారు. కానీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగనున్నాయి.
 
అలాగే ఈ రాశుల వారికి సూర్య గ్రహణం అంతగా కలిసిరాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వృషభరాశి జాతకులకు ఈ సూర్యగ్రహణం కాస్త ప్రతికూల ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి. ప్రతి విషయంలోను నిగ్రహంగా వుండటం నేర్చుకోవాలి. అలాగే వ్యాపారంలో నష్టపోవచ్చు. శుభవార్త ఏమిటంటే.. అత్తగారింటి నుంచి సహాయం లభిస్తుంది. ఇంకా సమస్యల నుంచి గట్టెక్కేందుకు సూర్య గ్రహణ చెడు ప్రభావాలను నివారించడానికి ఈ రాశికి చెందిన జాతకులు విష్ణు సహస్రనామం పఠించాలి. 
Astrology
 
మిథునం:
ఈ జాతకులు సూర్యగ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిది. ఆరోగ్యానికి ఆందోళనకరమైన కాలం. మిథున రాశి జాతకులు ఇతరులతో అతిగా మాట్లాడటం చేయకూడదు. ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. ఈ జాతకులు కూడా రోజూ, ఉదయం సాయంత్రం పూట విష్ణు సహస్రనామం తప్పక పఠించాలి.
 
తులారాశి జాతకులు ఈ సూర్యగ్రహణ ప్రభావంతో ఉద్యోగానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల, వారు పేదలకు ఆహారం, నీటిని దానం చేయాలి. ఒకరికి డబ్బు ఇచ్చే ముందు అనేకసార్లు ఆలోచించాలి. ఇతరులతో వాదనలకు దిగడం మంచిది కాదు. అయితే ఈ సూర్య గ్రహణం ప్రభావంతో వ్యాపారంలో లాభాలుంటాయి. అయినా ముందు జాగ్రత్తగా మసలుకోవాలి.
 
వృశ్చిక రాశి జాతకులు ఈ సూర్యగ్రహణ ప్రభావంతో ఉద్యోగానికి ఇబ్బందులు తప్పవు. అయితే, వ్యాపారాలతో ఆ సమస్యలను అధిగమిస్తారు. సూర్య గ్రహణ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి, ఈ రాశిచక్రానికి చెందిన జాతకులు మైసూర్ పప్పుల్ని దానం చేయాలి. ఇంకా రోజూ హనుమాన్ చాలీసాను జపించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

తర్వాతి కథనం
Show comments