Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవ సమాధులను ఏ రోజు దర్శించుకోవాలి.. అదీ సోమవారం..?

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (05:00 IST)
సిద్ధులు, యోగులు జీవ సమాధి అవుతారని వినే వుంటాం. అయితే అలాంటి జీవ సమాధులు వెలసిన క్షేత్రాలను పూజించడం చేయవచ్చా..? జీవ సమాధులను దర్శించుకోవడం.. పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయి..? ఇంకా జీవ సమాధులను ఏ సమయంలో పూజించాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి.
 
న్యాయమైన, నీతి నిజాయితీతో కోరిన కోర్కెలు.. సోమవారం ఉదయం ఏడు గంటల్లోపు లేదంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది సోమవారాలు దర్శించుకోవడం, పూజించడం చేయాలి.
 
కులదైవం ఏమిటో తెలియనివారు, కులదైవ కోపానికి గురైనవారు, కులదైవ పూజ చేయని వారు, కులదైవాన్ని శుభ్రం మరిచిపోయిన వారు.. ఇలాంటి చర్యలతో ఇబ్బందులు, ఈతిబాధలు ఎదుర్కొనే వారు.. మంగళవారాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లో జీవ సమాధులను దర్శించుకుని నేతి దీపం వెలిగించి.. అగరవత్తులు ధూపమేయాలి. ఇలా ఎనిమిది వారాలు జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది.
 
వ్యాపారాల్లో అభివృద్ధి పొందాలనుకునేవారు.. ఉద్యోగాల్లో రాణించాలనుకునేవారు, ఆర్థికాభివృద్ధి పొందాలనుకునేవారు.. జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది. ఇలాంటి వారు బుధవారాల్లో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది వారాలు చేయాలి.
 
అలాగే గురువారాల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకు జీవ సమాధులు ఉపయోగపడతాయి. ఉద్యోగ రీత్యా ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనుకునేవారు.. శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు జీవ సమాధిని దర్శించుకోవడం మంచిది. ఇలా ఎనిమిది శుక్రవారాలు చేయాలి.
 
అలాగే శనివారాల్లో జీవ సమాధులను దర్శించుకుంటే.. కుటుంబ సమస్యలు, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కోర్టు వివాదాలు, న్యాయస్థానాల సమస్యలు తొలగిపోవాలంటే.. ఆదివారం జీవ సమాధులను దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఆదివారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి.
 
ఇంకా జీవసమాధులను దర్శించుకునేవారు ఎవరైనా.. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం. ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోని ఏదైనా జీవ సమాధిని దర్శించుకోవడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. 
 
ఇంకా ఎనిమిది వారాల పాటు జీవ సమాధులను దర్శించుకుంటేనే సకలసుఖ సంతోషాలను పొందవచ్చు. కానీ ఎనిమిది వారాలు జీవ సమాధులను వరుసగా దర్శించుకున్నాక.. నెలకోసారి మూడు నెలలకు ఓసారి మాత్రమే దర్శించుకుంటే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

తర్వాతి కథనం
Show comments