Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం పూట సాయంత్రం జీవ సమాధులను దర్శించుకుంటే?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (19:10 IST)
సిద్ధులు, యోగులు జీవ సమాధి అవుతారని వినే వుంటాం. అయితే అలాంటి జీవ సమాధులు వెలసిన క్షేత్రాలను పూజించడం చేయవచ్చా..? జీవ సమాధులను దర్శించుకోవడం.. పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయి..? ఇంకా జీవ సమాధులను ఏ సమయంలో పూజించాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి.


న్యాయమైన కోర్కెలు నెరవేరాలంటే.. సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది సోమవారాలు దర్శించుకోవడం, పూజించడం చేయాలి.
 
కులదైవం ఏమిటో తెలియనివారు, కులదైవ కోపానికి గురైనవారు, కులదైవ పూజ చేయని వారు, కులదైవాన్ని శుభ్రం మరిచిపోయిన వారు.. ఇలాంటి చర్యలతో ఇబ్బందులు, ఈతిబాధలు ఎదుర్కొనే వారు.. మంగళవారాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లో జీవ సమాధులను దర్శించుకుని నేతి దీపం వెలిగించి.. అగరవత్తులు ధూపమేయాలి. ఇలా ఎనిమిది వారాలు జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది. 
 
వ్యాపారాల్లో అభివృద్ధి పొందాలనుకునేవారు.. ఉద్యోగాల్లో రాణించాలనుకునేవారు, ఆర్థికాభివృద్ధి పొందాలనుకునేవారు.. జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది. ఇలాంటి వారు బుధవారాల్లో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది వారాలు చేయాలి. 
 
అలాగే గురువారాల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకు జీవ సమాధులు ఉపయోగపడతాయి. ఉద్యోగ రీత్యా ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనుకునేవారు.. శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు జీవ సమాధిని దర్శించుకోవడం మంచిది. ఇలా ఎనిమిది శుక్రవారాలు చేయాలి. 
 
అలాగే శనివారాల్లో జీవ సమాధులను దర్శించుకుంటే.. కుటుంబ సమస్యలు, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కోర్టు వివాదాలు, న్యాయస్థానాల సమస్యలు తొలగిపోవాలంటే.. ఆదివారం జీవ సమాధులను దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఆదివారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి.
 
ఇంకా జీవసమాధులను దర్శించుకునేవారు ఎవరైనా.. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం. ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోని ఏదైనా జీవ సమాధిని దర్శించుకోవడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఎనిమిది వారాల పాటు జీవ సమాధులను దర్శించుకుంటేనే సకలసుఖ సంతోషాలను పొందవచ్చు. కానీ ఎనిమిది వారాలు జీవ సమాధులను వరుసగా దర్శించుకున్నాక.. నెలకోసారి మూడు నెలలకు ఓసారి మాత్రమే దర్శించుకుంటే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments