భగవంతునికి ప్రసాదం ఎందుకు పెట్టాలంటే..?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:07 IST)
భగవంతునికి ప్రసాదం ఎందుకు పెట్టాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదావాల్సిందే. సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరైనా పద్దతేనా అంటే.. ఆధ్యాత్మిక పండితులు ఏం చెప్తున్నారంటే.. భగవంతుడు సర్వశక్తిమంతుడు. వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు. 
 
కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు. అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం. 
 
దేవుని పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్థనా లక్ష్యంపై మనసు సంపూర్ణంగా లగ్నం కాదు. ప్రసాదం అంటే దేవునికి లంచం ఇవ్వడం కాదు. భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో చరిత్ర సృష్టించిన ఈ-మోటొరాడ్: అతిపెద్ద ఎలక్ట్రిక్ బైసికిల్ డెలివరీతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

చంద్రబాబుకు వైఎస్సార్ అసెంబ్లీ క్షమాపణ చెప్పడం చూశాను.. గంటా శ్రీనివాస్

Woman : ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకున్న మహిళ.. లక్షలు కొట్టేసి జంప్

TTD EO Anil Kumar Singhal: నెయ్యిలో కల్తీ ఆరోపణలు.. టీటీడీ ఈవో బదిలీ

Ambati Rambabu: అంబటి రాంబాబుపై 16 కేసులు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

అన్నీ చూడండి

లేటెస్ట్

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

తర్వాతి కథనం
Show comments