Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్య పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం.. లక్ష్మీ పూజ చేస్తే?

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (12:16 IST)
పుష్య పౌర్ణమి నేడు (జనవరి 28). ఈ రోజున సాయంత్రం పూట సత్యనారాయణ పూజ లేదా వ్రతం, లక్ష్మీపూజ చేసిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అంతేగాకుండా తులసీ పూజ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మిని నిష్ఠతో పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. లక్ష్మీదేవికి నేతి దీపం వెలిగించడంతో పాటు తెలుపు పువ్వులతో పూజించాలి. 
 
తులసీ కోట ముందు దీపం వెలిగించి.. తులసీ పూజ చేయడం ద్వారా శ్రీలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అలాగే శివాభిషేకం చేయించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఉసిరి కాయలపై ఆవు నేతితో తడిరిన వత్తులను వుంచి దీపాలను వెలిగించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే జనవరి 28 గురువారం నాడు ఈ ఏడాది మొదటి గురుపుష్య యోగం సంభవించనుంది. అయితే జనవరి 1న కొంచెం సేపు ఈ యోగం ఘడియలు ఉన్నాయి. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగాన్ని అత్యంత అరుదైన, ఉత్తమమై యోగాల్లో ఒకటిగా చెబుతారు. గ్రహాలకు గురువుగా బృహస్పతిని, పుష్య నక్షత్రాన్ని ప్రధాన దేవతగా పరిగణిస్తారు. గురువారం నాడు పుష్య నక్ష్తత్రం సంయోగం ఏర్పడుతుంది. ఇది శుభకరమైన యోగాలను తీసుకురానుంది. 
 
పౌర్ణమి రోజు గురుపుష్య యోగం వల్ల ఆధ్యాత్మిక, ధార్మిక సంపద వృద్ధికి పవిత్రమైంది. గురుపుష్య యోగాతో పాటు సర్వార్ధ సిద్ధి అనే శుభయోగం కూడా ఈ రోజున ఉంటుంది. ఈ కారణంగా నేటి ప్రాముఖ్యత చాలా రెట్లు పెరిగింది. ఈ అరుదైన కలయికపై సంపద పెంచడానికి మీరు కొన్ని చర్యలు తీసుకుంటే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
పుష్య పౌర్ణమి నాడు గురుపుష్య యోగం రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈ రోజు లక్ష్మీ నారాయణుడిని ఆరాధించే మంచి జరుగుతుంది. అంతేకాకుండా మహాలక్ష్మీకి తామర పూలు, తెలుపు రంగు మిఠాయిలు సమర్పించండి. తామర మాలతో 108 సార్లు "ఓం శ్రీ హ్రీ దారిదేరవినాశిన్యే ధనధాన్య సమృద్ధి దేహీ దేహీ నమః" అనే మంత్రాన్ని జపించండి. ఫలితంగా ధనం ప్రాప్తించడమే కాకుండా ధనవంతులవుతారు. అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరించిన వారికి శుభాలు చేకూరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

తర్వాతి కథనం
Show comments