Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్నను దర్శించుకున్నాక.. శ్రీ కాళహస్తికి ఎందుకు వెళ్ళాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (18:29 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులు దర్శనం అనంతరం తిరుమల దగ్గర్లో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకుంటారు. పాపవినాశనం, కాణిపాకంతో పాటు చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకోవడం సాధారణం. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెబుతారు. 
 
ఒకవేళ వెళితే అరిష్టం అనే ఆచారం హిందు సాంప్రదాయాలలో అనాది నుండి వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి, కాళహస్తీశ్వరుడిని దర్శించుకోవడంలో ఆంతర్యం ఏమిటి, ఆ ఆలయానికి వెళ్లిన తర్వాత మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. ఇలాంటి సందేహాలు రావడం అందరికీ సహజం. ఈ విశ్వం పంచభూతాల నిలయం. 
 
పంచభూతాలు అంటే గాలి, నింగి, నేల, నీరు, నిప్పు. వీటికి ప్రతితగా భూమి మీద పంచభూతలింగాలు వెలశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగం. అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇతర దేవాలయాలకు వెళ్లకూడదు అనే ఆచారం ఉంది. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. 
 
శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది, ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే వెళ్ళమని చెబుతారు. ఇక్కడి పూజల వలన దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలు వదిలేసి ఇంటికి వెళ్ళాలి, తిరిగి ఇతర దేవాలయాలకు కానీ లేదా మరెక్కడికైనా వెళ్ళినా దోష నివారణ ఉండదనేది ప్రతీతి. 
 
అలాగే గ్రహణాలు పరమశివుడికి ఉండవని మిగతా అందరి దేవుళ్ళకి శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా చంద్రగ్రహణం రోజున గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఈ సమయంలో కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు, గ్రహణానంతరం శుద్ధి జరిపిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. 
 
అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవదర్శనం అవసరం లేదని నీతి. భక్తులందరూ ఏడాదిలో ఒక్కసారైనా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ రాహుకేతు పూజలు చేయించుకుని అక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులు నుండి గట్టెక్కవచ్చని పండితులు చెబుతుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments