Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి.. కూర్మ ద్వాదశి విశిష్టత... బంగారు వర్ణంలో తాబేలును?

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (23:00 IST)
వైకుంఠ ఏకాదశి వ్రతమాచరించిన వారు ద్వాదశి రోజున పారణ చేయడం ఐతిహ్యం. ఈ ఏడాది ద్వాదశి తిథి.. జనవరి 3, 2023, రాత్రి 10.19 నిమిషాలకు ముగియనుంది. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి పుణ్య స్నానాలు చేయాలి. పుణ్యస్నానం చేసిన అనంతరం విష్ణుమూర్తిని ప్రార్థించాలి. 
 
ఈ రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ఆ రోజున స్వచ్ఛమైన ఆవు నేతితో దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
స్వామికి నైవేద్యంగా పండ్లు, పంచామృతం అభిషేకం సమర్పించాలి. అలాగే విష్ణు సహస్ర నామాన్ని, నారాయణ స్తోత్రాన్ని పఠించాలి. ఇంకా కూర్మావతారమైన తాబేలును పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. బంగారం వర్ణంలో ఉండే తాబేలు ఇంట్లో వుంచడం శుభప్రదం.
 
కూర్మ ద్వాదశి రోజున దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మథనం చేశారని పురాణాలు చెప్తున్నాయి. వీరంతా మందర పర్వతాన్ని ఉపయోగించి సాగర మథనం చేశారు. 
 
ఆ సమయంలో విష్ణువు కూర్మావతరంలో మందర పర్వతాన్ని ధరించి, సాగర మథనం చేస్తున్న వారితో దేవతలకు అమృతం ఇచ్చినట్లు విశ్వాసం. అందుకే కూర్మ ద్వాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు అంకితం చేస్తారు.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments