Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు హనుమంతుడి పాదాలను తాకకూడదా?

హనుమంతుడు చిరంజీవి. శ్రీ కృష్ణునిచే ఉపదేశించబడిన పవిత్ర భగవద్గీతను వినిన నలుగురిలో హనుమంతుడు ఒకరు. అలాగే శ్రీకృష్ణుడిని విశ్వరూపాన్ని దర్శించుకున్న వారిలోనూ హనుమంతుడున్నాడు. శ్రీకృష్ణ విశ్వరూపాన్ని అర

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:22 IST)
హనుమంతుడు చిరంజీవి. శ్రీ కృష్ణునిచే ఉపదేశించబడిన పవిత్ర భగవద్గీతను వినిన నలుగురిలో హనుమంతుడు ఒకరు. అలాగే శ్రీకృష్ణుడిని విశ్వరూపాన్ని దర్శించుకున్న వారిలోనూ హనుమంతుడున్నాడు. శ్రీకృష్ణ విశ్వరూపాన్ని అర్జునుడు, సంజయుడు, బార్బరికా (ఘటోత్కచుడి కుమారుడు)లతో పాటు హనుమంతుడు కూడా దర్శించుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
అలాంటి మహిమాన్వితుడైన హనుమంతుని పాదాలను మహిళలు స్పృశించరాదు. ఆయన బ్రహ్మచారి కావడంతో మహిళలు హనుమాన్ శిల్పాలను, శిలలను తాకడం చేయకూడదు. హనుమంతుని విగ్రహాలను తాకుండా మహిళలు పూజ చేసుకోవచ్చు. కానీ పురుషులకు ఆ నియమం లేదు. 
 
అలాగే హనుమంతునికి రాసే సింధూరాన్ని కూడా మహిళలు శుచిగా వున్నప్పుడే నుదుట ధరించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. పంచామృతం, తులసీ దళాలతో పూజ చేసినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.
 
హనుమంతుడు ఎందుకు నమస్కరిస్తూనే వుంటాడంటే?
రావణ వధ పూర్తయ్యాక సీతారాములు వెళ్ళిపోతూ ఆంజనేయునితో వరం కోరుకోమంటారు. అప్పుడు హనుమంతుడు తనకు మరే విధమైన కోరికలు వద్దు. ఏ రూపం చూసినా అందులో మీ రూపమే కనిపించేలాగ, ఏ శబ్ధం వినిపించినా అందులో సీతారాముల కథ వినిపించేలా, ఎక్కడ నమస్కరించినా అది మీకే చెందేలా వుండే ఈ భావం నాకు శాశ్వతంగా వుండేలా అనుగ్రహించు అని కోరుకున్నాడు. దానికి రాముడు సరే అన్నాడు. 
 
అందుకే ఆంజనేయుని నమస్కారం సీతారాములకే చెందుతుంది. అంతేగాకుండా సీతారాములకు నమస్కరిస్తున్న హనుమకి నమస్కరించడం ఆ సీతారాములకీ మరింత ఇష్టం. ఎందుకంటే.. భగవంతుడు తనకు భక్తుడు చేసే నమస్కారానికి ఎక్కువ ప్రాధాన్యత మిస్తాడు కాబట్టి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

Mercury transit 2025: బుధ గ్రహ పరివర్తనం.. ఈ రాశుల వారికి లాభదాయకం

శ్రీ సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

29-09-2025 సోమవారం దినఫలితాలు : మానసిక ప్రశాంతత పొందుతారు...

28-09-2025 ఆదివారం దినఫలితాలు : మానసిక ప్రశాంతత పొందుతారు...

28-09-2025 నుంచి 04-10-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments