Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారం తిన్నాక తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవచ్చా?

మాంసాహారం తీసుకుని తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవచ్చా.. అనే అనుమానం మీలో వుందా.. అయితే ఈ కథనం చదవండి. మాంసాహారం తీసుకున్నప్పటికీ.. స్నానం చేసి లేదా తలంటు స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చునని కొందరు

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (14:55 IST)
మాంసాహారం తీసుకుని తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవచ్చా.. అనే అనుమానం మీలో వుందా.. అయితే ఈ కథనం చదవండి. మాంసాహారం తీసుకున్నప్పటికీ.. స్నానం చేసి లేదా తలంటు స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చునని కొందరు అనుకుంటారు. కానీ అది ఎంతమాత్రం సరికాదు.


మాంసాహారం తీసుకుని ఒక రాత్రి గడిచిన తర్వాతే ఆలయ దర్శనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సాధారణంగా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు.. మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం.
 
మాంసాహారం తమో, రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది. ఆధ్యాత్మిక పరమైన పనులు చేసేటప్పుడు మనస్సు ప్రశాంతంగా వుండాలి. సాత్విక భావనలతో భగవంతుడిని స్మరించాలి. అంతేకాకుండా.. మాంసాహారం జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది. ఆ జీర్ణక్రియ ప్రభావంతో మెదడు తాత్కాలికంగా చురుకుదనాన్ని కోల్పోతుంది.

అందుకే దైవకార్యాలు చేసేటప్పుడు, దైవ దర్శనానికి వెళ్లే ముందు మాంసాహారాన్ని తినతూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆలయాలకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పంచశుద్ధితో ఆలయ దర్శనం చేసుకోవాలని వారు చెప్తున్నారు. 
 
శారీర, ఆహార, మానస, వాక్ శుద్ధితో పాటు చేసే పనులు శుద్ధిగా వుండాలి. అలాంటప్పుడే ఆలయ దర్శనం ద్వారా లభించే శుభఫలితాలు దక్కుతాయి. ఇందులో భాగంగానే ఆలయానికి వెళ్లే ముందు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని, అదీ ఇంట తయారు చేసిన ఆహారాన్ని తీసుకుని దైవ దర్శనం చేసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని వారు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ... న్యాయాధికారం దుర్వినియోగం : సుప్రీంకోర్టు

గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

అన్నీ చూడండి

లేటెస్ట్

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

తర్వాతి కథనం
Show comments