Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభరణి- యమదీపం.. కాకులకు నల్ల నువ్వులు.. ఆవు నెయ్యి?

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (10:23 IST)
మహాభరణి పితృపక్షంలో వస్తుంది. ఈ రోజున పితృ దేవతలకు తర్పణం ఇస్తే ముక్తిని పొందుతారు. దీనిని పితృదేవతల ఆశీర్వాదం పొందేందుకు ఈ రోజుగా పరిగణించబడుతుంది. మొత్తం 27 నక్షత్రాలలో రెండవ నక్షత్రంగా భరణిని పరిగణించబడుతుంది. 
 
ఈ భరణి నక్షత్రానికి శుభఫలితాలను ఇస్తుంది. ఇంకా పితృదోషాలను దూరం చేస్తుంది. ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కోసం పితృపక్షంలో వచ్చే ఈ భరణి నక్షత్రం రోజున పితృదేవతలను పూజించడం మంచిది. చతుర్థశి రోజున వచ్చే ఈ భరణి నక్షత్రం నాడు యమదీపం వేయడం ద్వారా నరకం అనుభవించే పితరులను స్వర్గానికి పంపుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తద్వారా పితరుల ఆశీర్వాదం అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. 
 
ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే.. 
ఈ దీపాన్ని భరణి నక్షత్రం వున్న రోజు బ్రహ్మముహూర్తం లేదా.. సాయంత్రం పూట ఇంటికి వెలుపల వెలిగించాలి. ఈ దీపం దక్షిణ ముఖాన వుండాలి. దీప జ్యోతి దక్షిణం వైపు చూసేలా వుండాలి. అలా ఇంట్లో వెలిగించడం కుదరకపోతే.. ఈ యమ దీపాన్ని శనీశ్వరుడి ముందు వెలిగించాలి. 
 
ఈ రోజున అన్నదానం చేయడం.. నల్ల నువ్వులు, ఆవు నెయ్యి కాస్త కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇలా చేస్తే పితృశాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లింగ్.. భార్యగా నటించేందుకు మహిళను అద్దెకు తీసుకున్నాడు..

కాదంబరి వ్యవహారం: వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్టు

సింగరేణి కార్మికులకు రూ. 1.90లక్షల బోనస్‌.. దసరా కానుక

గణేష నిమజ్జనం- మహిళల పట్ల అలా ప్రవర్తించారు.. 999 మంది అరెస్ట్

సైబర్ నేరగాళ్ల పంజా.. సుప్రీం కోర్టు యూట్యూబ్ హ్యాక్!!

అన్నీ చూడండి

లేటెస్ట్

పితృ దోషాలు తొలగిపోవాలంటే.. సోమవారం ఉపవాసం వుండి?

పితృపక్షం మహాలయంతో పూర్తి.. ఇవి చేయాలి.. ఇవి చేయకూడదు..

17-09-2024 మంగళవారం దినఫలితాలు : శకునాలు పట్టించుకోవద్దు...

అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది.. మహిమ ఏంటి?

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments