Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభరణి- యమదీపం.. కాకులకు నల్ల నువ్వులు.. ఆవు నెయ్యి?

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (10:23 IST)
మహాభరణి పితృపక్షంలో వస్తుంది. ఈ రోజున పితృ దేవతలకు తర్పణం ఇస్తే ముక్తిని పొందుతారు. దీనిని పితృదేవతల ఆశీర్వాదం పొందేందుకు ఈ రోజుగా పరిగణించబడుతుంది. మొత్తం 27 నక్షత్రాలలో రెండవ నక్షత్రంగా భరణిని పరిగణించబడుతుంది. 
 
ఈ భరణి నక్షత్రానికి శుభఫలితాలను ఇస్తుంది. ఇంకా పితృదోషాలను దూరం చేస్తుంది. ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కోసం పితృపక్షంలో వచ్చే ఈ భరణి నక్షత్రం రోజున పితృదేవతలను పూజించడం మంచిది. చతుర్థశి రోజున వచ్చే ఈ భరణి నక్షత్రం నాడు యమదీపం వేయడం ద్వారా నరకం అనుభవించే పితరులను స్వర్గానికి పంపుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తద్వారా పితరుల ఆశీర్వాదం అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. 
 
ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే.. 
ఈ దీపాన్ని భరణి నక్షత్రం వున్న రోజు బ్రహ్మముహూర్తం లేదా.. సాయంత్రం పూట ఇంటికి వెలుపల వెలిగించాలి. ఈ దీపం దక్షిణ ముఖాన వుండాలి. దీప జ్యోతి దక్షిణం వైపు చూసేలా వుండాలి. అలా ఇంట్లో వెలిగించడం కుదరకపోతే.. ఈ యమ దీపాన్ని శనీశ్వరుడి ముందు వెలిగించాలి. 
 
ఈ రోజున అన్నదానం చేయడం.. నల్ల నువ్వులు, ఆవు నెయ్యి కాస్త కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇలా చేస్తే పితృశాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments