Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది.. అంతా కరోనా మాయ..

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (20:35 IST)
''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది. ప్రజల కోరిక మేరకు ''రామాయణ్‌'' ధారావాహికను పునః ప్రసారం చేస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 28 నుంచి రోజూ ఉదయం 9: 10 నిమిషాలకు ఒక ఎపిసోడ్‌, సాయంత్రం 9: 10 గంటలకు డీడీ ఛానల్‌లో రెండు ఎపిసోడ్‌లని ప్రసారం చేయనున్నారట. ట్విట్టర్ నెటిజన్‌ల విజ్ఞప్తులతో హోరెత్తిపోవడంతో ఈ సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేస్తున్నారు. 
 
33 ఏళ్ల క్రితం హిందీలో రామానంద సాగర్ తీసిన వీక్లీ సీరియల్ ఇది. 1987లో వచ్చిన ఈ ధారావాహిక ఉత్తరాది రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ప్రతీ ఆదివారం ఉదయం 10 అయిందంటే చాలు `రామాయణ్‌` డబ్బింగ్ సీరియల్ అయినా సరే చిన్నాపెద్దా.. ముసలీ ముతకా అంతా టీవీల ముందు పాతుకు పోయేవారు. 
 
85 వారాల పాటు నిరాటంకంగా సాగిన ఈ సీరియల్ 1988 జూలై 31న ప్రసారమైన చివరి ఎపిసోడ్‌తో పూర్తియింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సీరియల్‌ని మళ్లీ ప్రసారం చేయబోతున్నారు. కరోనా వైరస్ కారణంగా 21 రోజుల పాటు ఇండియా మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో నెటిజన్స్ అంతా ''రామాయణ్‌''ని పునః ప్రసారం చేయాల్సిందే అంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments