Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది.. అంతా కరోనా మాయ..

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (20:35 IST)
''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది. ప్రజల కోరిక మేరకు ''రామాయణ్‌'' ధారావాహికను పునః ప్రసారం చేస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 28 నుంచి రోజూ ఉదయం 9: 10 నిమిషాలకు ఒక ఎపిసోడ్‌, సాయంత్రం 9: 10 గంటలకు డీడీ ఛానల్‌లో రెండు ఎపిసోడ్‌లని ప్రసారం చేయనున్నారట. ట్విట్టర్ నెటిజన్‌ల విజ్ఞప్తులతో హోరెత్తిపోవడంతో ఈ సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేస్తున్నారు. 
 
33 ఏళ్ల క్రితం హిందీలో రామానంద సాగర్ తీసిన వీక్లీ సీరియల్ ఇది. 1987లో వచ్చిన ఈ ధారావాహిక ఉత్తరాది రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ప్రతీ ఆదివారం ఉదయం 10 అయిందంటే చాలు `రామాయణ్‌` డబ్బింగ్ సీరియల్ అయినా సరే చిన్నాపెద్దా.. ముసలీ ముతకా అంతా టీవీల ముందు పాతుకు పోయేవారు. 
 
85 వారాల పాటు నిరాటంకంగా సాగిన ఈ సీరియల్ 1988 జూలై 31న ప్రసారమైన చివరి ఎపిసోడ్‌తో పూర్తియింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సీరియల్‌ని మళ్లీ ప్రసారం చేయబోతున్నారు. కరోనా వైరస్ కారణంగా 21 రోజుల పాటు ఇండియా మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో నెటిజన్స్ అంతా ''రామాయణ్‌''ని పునః ప్రసారం చేయాల్సిందే అంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కవితను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పార్టీ?

Chandrababu: అనంతపురంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు.. రాయలసీమకు ప్రత్యేక ఆకర్షణ

Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు

Tamil Nadu: హెడ్ మాస్టర్ కాళ్లకు మసాజ్ చేసిన విద్యార్థులు..

lunar eclipse, బెంగళూరు నెత్తిపైన 327 నిమిషాల పాటు సుదీర్ఘ చంద్రగ్రహణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments