కార్తీక వనభోజనాలు గుంటూరు ఎన్నారై అసోసియేషన్ ఆధ్వర్యలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్రిస్కో ప్రొటెంమేయర్ షోన హుఫ్మం పాల్గొని మాట్లాడుతూ తెలుగువారు అమెరికా సమాజంలో కలసిపోయి అభివృద్ధిలో బాగస్వాములవుతూ సమాజ సేవ చేస్తున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో ప్రసంగించిన పలువురు కార్తీక మాసంలో వనభోజనాల విశిష్టత, ఆచార వ్యవహారాలు, మన సంప్రదాయాలు, మన సాంప్రదాయ వంటలు మరియు ఆటలను పిల్లలకు తెలియజేసేలా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందరంగా ఉందన్నారు. దాదాపు 1600 మంది ప్రవాస గుంటూరు ఎన్నారైలు పాల్గొన్నఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు అమెరికా మరియు భారత జాతీయ గీతాలతో ప్రారంభమై.. మన సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ కార్యక్రమాలతో సూర్యాస్తమయం వరకు కొనసాగించారు.
వీటిలో ప్రధానంగా అతిథుల కొరకు రుచికరమైన 40 రకాల గుంటూరు సాంప్రదాయ వంటకాలు తయారుచేసి అందించారు. పిల్లలు, మహిళలు మరియు పురుషులు అందరికి వివిధ రకాలైన ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. స్థానిక పిల్లల పాటలు, డ్యాన్సులు, కోలాటం తదితర వినోద కార్యక్రమాలతో వనభోజనాలు ముగిసేవరకు కొనసాగించారు. బింగో, లక్కీ డ్రా తదితర ఆటలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు.
ఈ కార్యక్రమం విజయవంతమవడానికి సహకరించిన చాట్ ఎన్ దోస రెస్టారెంట్, అరోమా, అమరావతి, ఆంధ్రా మెస్, బావార్చి, సెవెన్ స్పైసెస్, హరేలి గ్రోసరీస్, శ్రీకృష్ణ జ్యూయెలర్స్, ఉమెన్స్ డాట్ నెట్, బైట్ గ్రాఫ్ మరియు వారికి నిర్వాహకులు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియ చేసారు.