తెలుగువారి యోగ క్షేమాలపై అమెరికాలో నాట్స్ నాయకులకు బాలకృష్ణ ఫోన్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (22:17 IST)
న్యూయార్క్: అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడ తెలుగువారు ఎలా ఉన్నారనే దానిపై ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఆరా తీశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నాయకులకు ఫోన్ చేసి అమెరికాలో ఉంటున్న తెలుగువారు యోగక్షేమాలు కనుక్కున్నారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్, న్యూయార్క్‌లో ప్రముఖ వైద్యులు నాట్స్ మాజీ చైర్మన్ మధు కొర్రపాటికి ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కనుక్కున్నారు. 
 
ముఖ్యంగా తెలుగువారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది అడిగి తెలుసుకున్నారు. తెలుగువారంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తెలుగు సంఘాలు వారిని ఎప్పటికప్పుడూ కరోనా కట్టడిపై చైతన్యపరచాలని కోరారు. ఇండియా సమయం ప్రకారం శుక్రవారం తెల్లవారు ఝామున నాలుగు గంటలకు ఈ కాల్ చేసినట్టు నాట్స్ నాయకులు తెలిపారు. 
 
కరోనా కష్టకాలంలో తెలుగువారికి అండగా నిలవాలని కోరినట్టు చెప్పారు. అమెరికాలో తెలుగువారిని అప్రమత్తం చేస్తూ నాట్స్ కార్యక్రమాల చేస్తుందని.. తెలుగునాట కూడా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా డా. మధు కొర్రపాటి బాలకృష్ణకు వివరించారు. తెలుగువారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనేదే తన అభిమతమని బాలకృష్ణ అన్నట్టు మధు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

తర్వాతి కథనం
Show comments