గోంగూరతో రొయ్యలు కూరనా? ఎలా?

గోంగూరలో ఉండే పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలుచేస్తుంది. శరీరంలోని కొవ్వును కూడ నియంత్రిస్తుంది. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా శరీరంలోని రక్తపోటును

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (13:06 IST)
గోంగూరలో ఉండే పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలుచేస్తుంది. శరీరంలోని కొవ్వును కూడ నియంత్రిస్తుంది. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా శరీరంలోని రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి ఇది సహకరిస్తుంది.ఈ గోంగూరలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోంగూరలో అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా ఉంది. మరి దీంతో రొయ్యలు కూర ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
గోంగూర - 1 కప్పు
రొయ్యలు - 2 కప్పులు
వడియాలు - 1 కప్పు
నూనె - సరిపడా
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ ముద్ద - పావుకప్పు
ఉప్పు - తగినంత
కారం - ఒకటిన్నర స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4
జీలకర్ర - అరచెంచా
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో అరకప్పు నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక వడియాలు వేయించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని శుభ్రం చేసి వాటికి అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, ఉప్పు  వేసి బాగా కలుపుకోవాలి. వడియాలు వేయించిన బాణలిలోనే మరికొంచెం నూనె వేసి రొయ్యల్ని వేయించి తీసుకోవాలి. కాసేపు అలాలే ఉంచి అవి మెత్తగా అయిన తరువాత దించేయాలి.

మరో బాణలిలో రెండు చెంచాల నూనెను వేడిచేసి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయ ముద్ద వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయాక వేయించుకున్న రొయ్యలు, గోంగూరను వేసుకోవాలి. తరువాత అరకప్పు నీళ్లు, తగినంత ఉప్పు, మిగిలిన కారం వేసి మంట తగ్గించాలి. గోంగూర పూర్తిగా మగ్గి, ఇది కూరలా తయారయ్యాక ముందుగా వేయించుకున్న వడియాలు వేసి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. అంతే గోంగూర రొయ్యలు కూర రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆవుపై అత్యాచారం.. వీడియో వైరల్... స్థానికుల విధ్వంసం

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments