Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోంగూరతో రొయ్యలు కూరనా? ఎలా?

గోంగూరలో ఉండే పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలుచేస్తుంది. శరీరంలోని కొవ్వును కూడ నియంత్రిస్తుంది. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా శరీరంలోని రక్తపోటును

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (13:06 IST)
గోంగూరలో ఉండే పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలుచేస్తుంది. శరీరంలోని కొవ్వును కూడ నియంత్రిస్తుంది. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా శరీరంలోని రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి ఇది సహకరిస్తుంది.ఈ గోంగూరలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోంగూరలో అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా ఉంది. మరి దీంతో రొయ్యలు కూర ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
గోంగూర - 1 కప్పు
రొయ్యలు - 2 కప్పులు
వడియాలు - 1 కప్పు
నూనె - సరిపడా
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ ముద్ద - పావుకప్పు
ఉప్పు - తగినంత
కారం - ఒకటిన్నర స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4
జీలకర్ర - అరచెంచా
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో అరకప్పు నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక వడియాలు వేయించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని శుభ్రం చేసి వాటికి అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, ఉప్పు  వేసి బాగా కలుపుకోవాలి. వడియాలు వేయించిన బాణలిలోనే మరికొంచెం నూనె వేసి రొయ్యల్ని వేయించి తీసుకోవాలి. కాసేపు అలాలే ఉంచి అవి మెత్తగా అయిన తరువాత దించేయాలి.

మరో బాణలిలో రెండు చెంచాల నూనెను వేడిచేసి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయ ముద్ద వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయాక వేయించుకున్న రొయ్యలు, గోంగూరను వేసుకోవాలి. తరువాత అరకప్పు నీళ్లు, తగినంత ఉప్పు, మిగిలిన కారం వేసి మంట తగ్గించాలి. గోంగూర పూర్తిగా మగ్గి, ఇది కూరలా తయారయ్యాక ముందుగా వేయించుకున్న వడియాలు వేసి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. అంతే గోంగూర రొయ్యలు కూర రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments