ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వీటిలో మొక్కజొన్న పిండి తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. 20 నిమిషాల తరువాత ఈ రొయ్యల మిశ్రమంలో మొక్కజొన్న పిండి వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని ఇనుప చువ్వలకు గుచ్చి.. నిప్పులపై లేదా గ్రిల్ పద్ధతిలో ఓవెన్లో కాల్చుకోవాలి. అంతే... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రొయ్యల టిక్కా రెడీ.