నోరూరించే నెల్లూరు చేపల పులుసు తయారీ ఎలా?

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:44 IST)
కావలసినవి:
చేపలు             -  అరకిలో
నువ్వుల నూనె  -  ఆరు టేబుల్‌‌‌స్పూన్లు
ఆవాలు           -  అర టీస్పూన్
జీలకర్ర            -  అర టీస్పూన్
మెంతులు        -  అర టీస్పూన్
మిరియాలు      -  అర టీస్పూన్
ఎండుమిర్చి      -  మూడు 
కరివేపాకు        -  కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు  -  ఐదు
అల్లం ముక్క     -  చిన్నది
పచ్చిమిర్చి       -  నాలుగు
ఉల్లిపాయలు     -  నాలుగు
చింతపండు       -  పెద్ద నిమ్మకాయ సైజంత
టొమాటోలు      -  ఆరు
పసుపు           -  టీస్పూన్
కారం              -  రెండు టీస్పూన్
ధనియాల పొడి -  మూడు టీస్పూన్
ఉప్పు            -  రుచికి తగినంత
 
తయారీ విధానం:
ఒక పాన్‌‌లో నువ్వుల నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. మెత్తగా దంచిన అల్లం కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించాలి. చింతపండును రెండు కప్పుల నీళ్లలో 20నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. టొమాటోలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో చింతపండు రసం, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. అవసరమైతే మరో రెండు కప్పుల నీళ్లు పోసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వేగించిన ఉల్లిపాయల మిశ్రమంలో పోయాలి. చిన్న మంటపై అరగంటపాటు ఉడికించాలి. గ్రేవీ ఉడికిన తరువాత చేప ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి. కూర ఉడుకుతున్న సమయంలోనే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలను వేగించి పొడి చేసుకోవాలి. ఈ మసాల పొడిని కూరలో వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్‌‌పై నుంచి దింపుకోవాలి. అంతే నోరూరించే నెల్లూరు చేపల పులుసు రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్థిక సమస్యలు.. పెంచలేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తండ్రి

మిస్టర్ జగన్.... సీఎంగా ఉన్నపుడే ఏం పీకలేకపోయావ్... నా జోలికి రావొద్దు : శివాజీ హెచ్చరిక

ఇరాన్ పౌరులూ... గృహాలను వీడి బయటకు రావొద్దు : అమెరికా హెచ్చరిక

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. ఆపై లొంగిపోయాడు..

Telangana: తెలంగాణలో పడిపోనున్న పగటి ఉష్ణోగ్రతలు.. భారీ వర్షాలకు ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుందవై ఇంట్లోనే ఉండాలి.. పార్తీబన్ కామెంట్లపై త్రిష ఫైర్.. మైక్ దొరికిందని?

విడుదలకు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డులు ఎక్కడ?

నిహారిక కొణిదెల‌ నిర్మించిన రాకాస’నుంచి రపప్పా.. రపప్పా.. పాట విడుదల

Guruva Reddy: కమల్ హాసన్, ఎన్టీఆర్, నసీరుద్దీన్ షా ఏదైనా చేయగలరు : గురవ రెడ్డి

Vishal: విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో మొగుడు విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments