Navratri Day 5: నవరాత్రులు.. స్కంధమాతను పూజిస్తే... ఆకుపచ్చను ధరించడం చేస్తే?

సెల్వి
శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (10:19 IST)
Skandha Mata
నవరాత్రులు సందర్భంగా స్కంధమాతను ఐదవ రోజు పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో కుమార స్వామికి ప్రాధాన్యత ఇస్తారు. స్కంధమాత సింహవాహనం మీద నాలుగు చేతులతో అలరారుతూ వుంటుంది. రెండు చేతులా కమలాలను ధరించి, ఒక చేతితో అభయాన్ని అందిస్తూ.. మరో చేతితో కార్తికేయుడిని పట్టుకుని ఉండే అమ్మవారిగా ఆమె దర్శనమిస్తుంది. స్కంధమాతను పూజిస్తే.. ఇహంలో జ్ఞానం, పరంలో మోక్షం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆమెను పూజిస్తే కార్తీకేయుడి అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
కేవలం దేవీ నవరాత్రుల సందర్భంలోనే కాకుండా, స్కంధమాతను ఎప్పుడైనా పూజించవచ్చు. ఓం దేవి స్కంధమాతాయై నమః అనే మంత్రంతో ఆమెను స్తుతించడం వల్ల భక్తుల జీవితాలలో వుండే ఎలాంటి కష్టాన్నైనా.. ఈ తల్లీబిడ్డలు గట్టెక్కిస్తారని విశ్వాసం. 2025 సంవత్సరానికి, 5వ రోజు పవిత్ర రంగు ఆకుపచ్చ. 
 
అందుకే ఈ రోజున ఆకుపచ్చను ధరించడం మంచిది. ఆకుపచ్చ రంగు సామరస్యం, పెరుగుదల, శ్రేయస్సును సూచిస్తుంది. ఈ రోజున ఆకుపచ్చ రంగును ధరించడం స్కందమాత పోషణ శక్తికి అనుగుణంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

అన్నీ చూడండి

లేటెస్ట్

07-10-2025 మంగళవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments