ఏపీ సీఎంగా జగన్ 40 యేళ్లు ఉండాలి... భారతంలో దుర్యోధనుడు కాకూడదు.. : ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా సెటైర్ల రూపంలో వేశారు. జగన్ 40 యేళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నదే తన అభిలాష అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
నిజానికి సీఎం జగన్‌ను రఘురామరాజు ఎప్పుడు పొగుడుతారో.. ఎప్పుడు విమర్శిస్తారో ఎవరికీ తెలియదు. ఆయన చేసే వ్యాఖ్యలు కూడా నిందాస్తుతిని తలపిస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతంలో దుర్యోధనుడిలా సీఎం జగన్‌ అవ్వడం తనకు ఇష్టం లేదంటూనే, సీఎంగా 40 ఏళ్లు ఆయనే ఉండాలని అభిలషించారు. 
 
అంతలోనే ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల బ్యూరోక్రాట్స్‌కు కోర్టు మొట్టికాయలు వేసిందని, కోర్టుల చేత ఇన్ని అక్షింతలు వేయించుకున్న బ్యూరోక్రాట్స్ ఎవరూ లేరంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్ధుల విషయంలో అందరిదీ ఒక దారి అయితే ఏపీ సీఎంది ఇంకో దారి అని ఎద్దేవా చేశారు. సుప్రీం జోక్యంతో కరోనా వల్ల ఏపీ విద్యార్థులకు గండం తప్పిందని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments