Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎంగా జగన్ 40 యేళ్లు ఉండాలి... భారతంలో దుర్యోధనుడు కాకూడదు.. : ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా సెటైర్ల రూపంలో వేశారు. జగన్ 40 యేళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నదే తన అభిలాష అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
నిజానికి సీఎం జగన్‌ను రఘురామరాజు ఎప్పుడు పొగుడుతారో.. ఎప్పుడు విమర్శిస్తారో ఎవరికీ తెలియదు. ఆయన చేసే వ్యాఖ్యలు కూడా నిందాస్తుతిని తలపిస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతంలో దుర్యోధనుడిలా సీఎం జగన్‌ అవ్వడం తనకు ఇష్టం లేదంటూనే, సీఎంగా 40 ఏళ్లు ఆయనే ఉండాలని అభిలషించారు. 
 
అంతలోనే ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల బ్యూరోక్రాట్స్‌కు కోర్టు మొట్టికాయలు వేసిందని, కోర్టుల చేత ఇన్ని అక్షింతలు వేయించుకున్న బ్యూరోక్రాట్స్ ఎవరూ లేరంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్ధుల విషయంలో అందరిదీ ఒక దారి అయితే ఏపీ సీఎంది ఇంకో దారి అని ఎద్దేవా చేశారు. సుప్రీం జోక్యంతో కరోనా వల్ల ఏపీ విద్యార్థులకు గండం తప్పిందని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments