Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉంది: అలహాబాద్ హైకోర్టు

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (10:56 IST)
యువతీయువకులకు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉందని అలహాబాదు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని షహరాన్పూర్‌కు చెందిన పూజా అలియాస్ బోయా షావెజ్‌లు ప్రేమించుకున్నారు.
 
వీరిద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరని ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వారిని వెతికి పట్టుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరిని ఓ గదిలో నిర్భంధించారు. అయితే వారు తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని, తమకు కలిసి జీవించే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.
 
ఈ ఫిటిషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం యువతీయువకులను  తమ ఎదుట హాజరుపరచాలని తెలిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని తెలిపారు. నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీయువకులకు ఉందని స్ఫష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments