Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతానా మజాకా... కారు దిగిరాగానే పరుగో పరుగు

Webdunia
ఆదివారం, 5 మే 2019 (17:42 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే గల్లీ లీడర్లే కాదు.. బడా నేతలకు హడల్. ఆమె ముక్కుసూటి మనిషి. పేదల ముఖ్యమంత్రి. ఇందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరు. అలాంటి ఆమెకు శనివారం సాయంత్రం ఊహించని అనుభవం ఒకటి ఎదురైంది 
 
పశ్చి మిడ్నాపూర్‌లో కొందరు ఆమెను చూసి 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం మమత ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. 
 
కొంతమంది గ్రామస్తులు తమ చేతిలో బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్డుకిరువైపులా నిలబడిన కొందరు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని చూడగానే 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమత వెంటనే తన డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి ఒక్కసారిగా డోర్ తీసి కిందికి దిగారు. 
 
అంతే.. బీజేపీ కార్యకర్తలు ఆమెను చూసి పరుగు లంకించుకున్నారు. దీంతో మమత వారిని చూసి 'ఎందుకు పారిపోతున్నారు. ఇలా రండి...' అని పిలిచారు. వాళ్లంతా చాలా తెలివిగా తప్పించుకుంటున్నారంటూ పేర్కొన్న మమత అనంతరం అక్కడి నుంచి సభాస్థలికి బయల్దేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments