Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంస్కారం కోసం దుస్తులు ధరిస్తున్నా.. దిగంబరంగానే ఉండేందుకు ఇష్టపడతా: రాందేవ్ బాబా

ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చునని యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. మైసూర్ జిల్లా సుత్తూరు మఠంలో జరుగుతున్న ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రకమైన ఆసనాలు వేస్తే

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (13:48 IST)
ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చునని యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. మైసూర్ జిల్లా సుత్తూరు మఠంలో జరుగుతున్న ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రకమైన ఆసనాలు వేస్తే ఏ రోగాలు నివారణ అవుతాయో ఆయన ప్రజలకు వివరించారు. ఈ మేరకు ఆయన యోగాసనాలు వేసి ప్రజలకు చూపారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు యోగసనాలు వేయాలని ఆయన సూచించారు
 
అనంతరం రాందేవ్ బాబా మాట్లాడుతూ.. సాధువులు లోక సంక్షేమం కోసం పాటుపడుతారని.. తాను కూడా అదే దిశలో పనిచేస్తున్నానని ప్రకటించారు. ప్రజల ముందుకు సంస్కారం కోసం దుస్తుల్ని ధరిస్తున్నానని, లేదంటే దిగంబరంగానే ఉండేందుకు తాను ఇష్టపడతానని రాందేవ్ బాబా ప్రకటించారు. 
 
ఇంకా బాబా రాందేవ్ యోగా గురించి మాట్లాడుతూ.. ప్రాణాయామాలు ఒబిసిటీ, అసిడిటీ, గర్భ సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, అలెర్జీ, ఆస్తమాలను దూరం చేస్తుందని చెప్పారు. వీటి ద్వారా ఏకాగ్రతను పెంచుకోవడంతో పాటు జ్ఞాపకశక్తి పెంపొందుతుందని.. ఆవేశం తగ్గుముఖం పడుతుందని బాబా చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments