Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమదాం.. ఏడుగురు మృత్యువాత

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (07:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి మధుర యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై 68 మైలురాయి సమీపంలో బోల్తాపడివున్న ట్యాంకర్ లారీని ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. 
 
ఓ ట్యాంకర్‌ నోయిడా నుంచి ఆగ్రా వైపు వస్తోంది. ఈ క్రమంలో టైర్‌ పేలడంతో అదుపు తప్పి మరోమార్గంలో బోల్తాపడింది. అయితే, ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్న ఇన్నోవా అమితవేగంతో వచ్చి దాన్ని ఢీకొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. 
 
మృతులను హర్యానాలోని జింద్‌ వాసులని, మనోజ్ (45), అతని భార్య బబితా (40), కుమారులు అభయ్ (18), హేమంత్ (16), హిమాంగి (14), మను (10), డ్రైవర్ రాకేశ్ (39)గా గుర్తించారు. 
 
బోల్తాపడిన ట్యాంకర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇన్నోవా నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మృత్యువాతపడగా.. మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కట్టర్‌ను వినియోగించి మృతదేహాలను అందులో నుంచి బయటకు తీశారు. దీంతో ఆ ప్రాంతమైన రక్తసిక్తమైంది. ప్రమాదస్థలిని ఎస్పీ దేహాత్‌ శ్రీచంద్‌ సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments