Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యాపిల్లలతో బైకుపై వెళ్తుండగా దూకిన చిరుతపులి, చిరుతతో వీరోచిత పోరాటంలో...

భార్యాపిల్లలతో బైకుపై వెళ్తుండగా దూకిన చిరుతపులి, చిరుతతో వీరోచిత పోరాటంలో...
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:38 IST)
సాధారణంగా క్రూరమృగాలను చూస్తే ఆమడదూరం పారిపోతుంటారు. కానీ, ఆ వ్యక్తి కోసం తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులితో తలపడి విజయం సాధించారు. తన భార్య, కుమార్తెన కాపాడుకునేందుకు కుటుంబ యజమాని చిరుతపులిని చంపేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటకలోని హసన్ జిల్లా బెండాకెరె ప్రాంతానికి చెందిన రాజగోపాల్ నాయక్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా, అటవీప్రాంతంలో ఓ చిరుతపులి దాడి చేసింది. 
 
చిరుత ధాటికి బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ క్రమంలో ఆ చిరుత తన భార్య, కుమార్తెలను గాయపర్చడం చూసిన రాజగోపాల్ నాయక్ ప్రాణాలకు తెగించి ఆ చిరుతతో పోరాడాడు. 
 
తనకు గాయాలు అయినప్పటికీ భయపడకుండా ఆ చిరుతపులిని చంపేశాడు. చిరుత దాడిలో గాయపడిన రాజగోపాల్‌తో పాటు అతడి భార్య, కుమార్తెలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియల్ హీరో.. భార్యకూతురు కోసం.. పులితో పోరాటం