Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటిలో చిక్కుకున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి... రక్షించిన ఎన్డీఆర్ఎఫ్

North India
Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (12:04 IST)
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. అనేక జనావాస ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవహించడంతో అనేక గృహాలు నీట మునిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఇంట్లోకి కూడా నీరు వచ్చి చేరింది. దీంతో ఆయనను, కుటుంబసభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు. బీహార్ రాష్ట్రంలో రెండు దశాబ్దాల కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 
 
యూపీలో 111 మంది, బీహారులో 27 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క బీహారులోనే 20 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదికి సమీపంలో ఉండే బల్లియా జిల్లా జైలును వరద ముంచెత్తడంతో... జైల్లోని 900 మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు. 
 
ఇదిలావుంటే, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గత రెండు దశాబ్దాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ రెండు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 145 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరద బాధితులకు పార్టీ కార్యకర్తలు సహాయం చేయాలని బీహార్ కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments