Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తేనే ఎన్నికల్లో పోటీ : మెహబూబా ముఫ్తీ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (16:35 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే అధికరణాలు 370, 35ఏని పునరుద్ధరించే వరకు తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తేల్చి చెప్పారు. 
 
కాశ్మీర్ రాష్ట్రానికి తిరిగి ప్రత్యేక ప్రతిపత్తితో పాటు.. రాష్ట్ర హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ అఖిలక్ష నేతలతో ఢిల్లీలో సమావేసం నిర్వహించిచన విషయం తెల్సిందే. 
 
ఈ సమావేశంలో ముఫ్తీ మాట్లాడుతూ, 370,35ఏని ఆర్టికల్‌లను పునరుద్ధరించేవరకు అధికార రాజకీయాల్లో భాగం కాబోమని స్పష్టం చేశారు. పైగా, ఆ రెండింటినీ కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ పునరుద్ధరించబోదని తనకు తెలుసని, కానీ, ఎప్పుడో ఒకప్పుడు అది జరిగి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. 
 
ఇందుకోసం తాము పోరాటం చేస్తామన్నారు. అనుకున్నది సాధించే వరకు గుప్కర్ కూటమి కలిసికట్టుగా ఉద్యమిస్తుందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కునే తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 370ని రద్దు చేసి రాజ్యాంగాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments