Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ గ్యాంగ్‌ను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు : సీఎం ఎడప్పాడి

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (07:36 IST)
తమిళనాడులో మన్నార్‌కుడి గ్యాంగ్‌గా పేరుపొందిన అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళతో పాటు ఆమె అనుచరులను తిరిగి అన్నాడీఎంకే చేర్చుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి స్పష్టం చేశారు. 
 
అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను పూర్తి చేసుకున్న శశికళ ఇటీవలే విడుదలయ్యారు. ఆ తర్వాత ఆమె చెన్నైకు చేరుకున్నారు. దీనికితోడు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పైగా, జయలలిత వారసురాలిని తానేనని శశికళ ప్రకటించింది. 
 
అంతేకాదు, తన వాహనంపై ఆమె అన్నాడీఎంకే జెండాను ఉంచారు. ఈ నేపథ్యంలో శశికళను నిలువరించేందుకు అన్నాడీఎంకే నేతలు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నేరుగా రంగంలోకి దిగారు. శశికళ, దినకరన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
అన్నాడీఎంకేని నాశనం చేసేందుకు కొన్ని విష శక్తులు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. పార్టీ నుంచి బహిష్కరణకుగురైన వారు... పార్టీని వారి నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. 
 
వారు ఎన్ని గిమ్మిక్కులకు పాల్పడినా, తలకిందుల తపస్సు చేసినా పార్టీలో చేర్చుకోబోమని అన్నారు. జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయని చెప్పారు. శశికళ, దినకరన్ వర్గం ఆటలు సాగబోవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments