Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాలు... పురుగుల మందు తాగిన చిట్యాల్ సీఐ...

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (07:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సాయి రమణ పురుగుల మందు తాగారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వరంగల్‌ కేయూసీ ఫిల్టర్ బెడ్ సమీపంలో ఆయన.. తన కారులోనే పురుగుల మందు తాగారు. దీంతో ఆయన అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. 
 
ఇంతలో అటుగా బ్లూకోల్ట్ పెట్రోలింగ్ సిబ్బంది అపస్మారకస్థితిలో కారులో పడి వున్న వ్యక్తిని గమనించారు. అదేసమయంలో సీఐకి ఫోన్ రావడంతో పోలీసులు మాట్లాడటంతో ఆయన చిట్యాల సీఐ అని తెలిసింది. దీంతో వెంటనే ఆయనను హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. 
 
కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సీఐ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రమణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ వెంటనే హన్మకొండ వచ్చి చికిత్స పొందుతున్న సీఐని పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments