మా భార్యలు తెగ తాగేస్తున్నారు... పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తలు!!

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (08:39 IST)
మా భార్యలు తెగ తాగేస్తున్నారంటూ పలువురు భర్తలు వాపోతున్నారు. ఇదే అంశంపై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసైన తమ ఆడవాళ్లు ఇంటిని గుల్ల చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని లబోదిబోమంటున్నారు. ఇది కాస్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది పచ్చి నిజం. ఒరిస్సా రాష్ట్రంలోని కోరాట్‌పుట్ జిల్లా బరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామంలోని పురుషులందరూ బుధవారం పోలీసులు, ఆబ్కారీ అధికారులను కలిసి తమ బాధను మొరపెట్టుకున్నారు. 
 
గ్రామంలోని కొందరు యువకులు సారా తయారు చేసి విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తాము కూలి చేసి డబ్బులు సంపాదించి తెస్తుంటే తమ భార్యలు మాత్రం మద్యానికి బానిసై ఇల్లు గుల్ల చేస్తున్నారని, డబ్బులు మొత్తం మద్యానికే ధారబోస్తున్నారని వాపోయారు. ఇలాగైతే సంసారాలు గడవడం కష్టమని, పిల్లలు బతుకు అంధకారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సారా తయారీదారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాలను, గ్రామాన్ని రక్షించాలని వేడుకున్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు తగిన చర్యలకు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments