Webdunia - Bharat's app for daily news and videos

Install App

కజిన్‌తో వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా ఫలితం లేదు.. చివరికి?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (18:19 IST)
మానవీయ విలువలు మంటగలిసి పోతున్నాయి. భార్యాభర్తల సంబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం ఒక మహిళ నిండు ప్రాణాన్నిబలిగొంది. 
 
తన కజిన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను వద్దని మందలించాడు భర్త. అయినా భార్య లెక్క చేయకుండా ఆ బంధాన్ని కొనసాగించసాగింది. సహనం కోల్పోయిన భర్త, భార్యను గొంతు నులిమి హత్య చేసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు కార్పోరేషన్ పరిధిలోని తోండముత్తూరులో నివసించే లక్ష్మణ్ రాజ్ (36) శరణ్య(26)లకు ఆరేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్లుగా శరణ్య లక్ష్మణ్ రాజ్ కజిన్ యువ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
 
ఇటీవల లక్ష్మణ్ రాజ్ ఈవిషయాన్ని పసిగట్టాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోమని భార్యకు నచ్చ చెప్పాడు. అయినా శరణ్యలో మార్పు రాలేదు. దీంతో దంపతులు మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి.
 
ఏప్రిల్ 23 శుక్రవారం తెల్లవారు ఝూమున నిద్రపోతున్న శరణ్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments