Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-చైనా సరిహద్దుల్లో మహిళ హల్ చల్.. శివుడ్ని పెళ్లాడబోతున్నా

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (12:45 IST)
భారత్-చైనా సరిహద్దుల్లో ఓ మహిళ హల్ చల్ చేస్తోంది. లక్నోకు చెందిన ఆమె పేరు హర్మీందర్ కౌర్. తాను పార్వతీదేవినని, కైలాస పర్వతంపై కొలువున్న శివుడ్ని పెళ్లాడబోతున్నానని చెప్తోంది. వివరాల్లోకి వెళితే... నభిదాంగ్ ప్రాంతంలో నిషిద్ధ ప్రదేశంలో హర్మీందర్ కౌర్ ఉంటున్న విషయాన్ని గుర్తించిన పితోరాగఢ్ పోలీసులు ఆమెను అక్కడ్నించి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, తనను బలవంతంగా తీసుకెళితే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దాంతో వెనుదిరిగిన పోలీసులు, ఈసారి మరింత పెద్ద బృందంతో వెళ్లాలని నిర్ణయించారు. 
 
హిమాలయాల్లోని గుంజీ ప్రాంతానికి 15 రోజుల క్రితం తన తల్లితో కలిసి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అందుకు ఆమెకు అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే, ఆమె నిషిద్ధ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో పాటు, అనుమతించిన మేర గత నెల 25తో కాలపరిమితి పూర్తయిందని వివరించారు. దాంతో ఆమెను ఖాళీ చేయిస్తున్నామని వివరించారు. 
 
ఇద్దరు ఎస్సైలు, ఓ ఇన్ స్పెక్టర్ తో ఒక పోలీసు బృందాన్ని పంపిస్తే ఆమె తిరిగొచ్చేందుకు ససేమిరా అంటోందని, ఈసారి 12 మందితో పెద్ద బృందాన్ని పంపిస్తామని, ఆమెను నిషేధిత ప్రాంతం నుంచి వెలుపలికి తీసుకువస్తామని ఎస్పీ లోకేంద్ర సింగ్ వెల్లడించారు. తానే పార్వతీదేవినంటూ చెప్పుకోవడం చూస్తుంటే ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న విషయం అర్థమవుతోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments