Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త పుట్టింటికి పంపలేదని పసిబిడ్డలను ఉరేసి.. ఎంత పనిచేసింది..!?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (16:14 IST)
క్షణికావేశాలకు ప్రాణాలు బలితీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా భర్త పుట్టింట జరిగే శుభకార్యానికి వెళ్లేందుకు అనుమతివ్వలేదని.. ఓ మహిళ తన ఇద్దరు పసిబిడ్డలను ఫ్యానుకు ఉరేసి చంపేసింది. ఆపై తాను కూడా అదే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఢిల్లీ వాయవ్య ప్రాంతంలోని షాకూర్‌పూర్ ఏరియాలో గురువారం రాత్రి ఈ ఘటన వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన యువ దంపతులు కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసమని దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి షాకూర్‌పూర్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. వారికి ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. భర్త స్థానికంగా ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తుండగా, భార్య ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నది. అయితే ఇటీవల బీహార్ రాష్ట్రం, మధుబని జిల్లాలోని తమ స్వగ్రామంలో ఒక మతపరమైన శుభాకార్యం జరుగుతున్నట్లు వారికి కుటుంబసభ్యుల నుంచి కబురు వచ్చింది.
 
దాంతో తాను ఆ శుభకార్యానికి వెళ్తానని భార్య భర్తను కోరింది. అందుకు అతడు అంగీకరించకపోవడంతో గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం భర్త ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అయితే ఆ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య పసివాళ్లయిన తన ఇద్దరు పిల్లలను ఫ్యాన్ ఉరిబిగించి చంపింది. ఆ తర్వాత తాను కూడా అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది.
 
రాత్రి 10.30 గంటలకు డ్యూటీ నుంచి వచ్చిన భర్త తలుపు ఎంత తట్టినా తీయకపోవడంతో కిటిలోంచి చూశాడు. లోపల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన భార్యాపిల్లలను చూసి ఒక్కసారిగా గావుకేకలు పెట్టాడు. అనంతరం ఇరుగుపొరుగుతో కలిసి తలుపులు బద్దలుకొట్టి వారిని కిందికి దించారు. అయితే అప్పటికే చనిపోయారని నిర్ధారించుకుని పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments