Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్ కేంద్రంలోనూ వేధింపులా..? వీడియో తీసి పోస్ట్ చేసిన..?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (12:31 IST)
మహిళలపై కామాంధుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. తాజాగా కరోనాతో క్వారంటైన్‌కు వెళ్లిన మహిళలపై కూడా వేధింపులు జరుగుతున్నాయి. 
 
తాజాగా క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న వలస కార్మికురాలిపై స్థానిక సర్పంచి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సువర్ణపూర్‌ జిల్లా డుంగురిపల్లి సమితి అందారిబంచిలో ఆదివారం చోటుచేసుకుంది. సంబంధిత బాధిత యువతి సర్పంచిపై ఆరోపణలు చేస్తూ తనకు న్యాయం చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. జూన్‌ 1వ తేదీన తమిళనాడు నుంచి కొంతమంది వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. సువర్ణపూర్‌ జిల్లాకు చెందిన ఆయాప్రాంతాల క్వారంటైన్‌ కేంద్రాలకు పంపారు. ఇందులో అందారిబంచి క్వారంటైన్‌లో ఉన్న ఓ యువతికి ప్రత్యేక గది కేటాయించారు. 
 
స్థానిక సర్పంచి బనమాలిషా రోజూ రాత్రిపూట మద్యం తాగి కేంద్రానికి వచ్చి తనను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత యువతి ఆరోపించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments