Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌తో భర్త మృతి - భర్త వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చిన భార్య

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (13:07 IST)
కరోనా వైరస్ మహమ్మారిబారినపడిన భర్త కన్నుమూశాడు. కానీ, అతని వీర్యంతో మృతుని భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భీర్భూమ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ్ ప్రసాద్‌ అనే దంపతులకు 27 యేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, సంగీతకు గర్భాశయ సమస్యల కారణంగా సంతానం కలగలేదు. దీంతో భర్త వీర్యంతో ఐవీఎస్ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి రెండేళ్ల క్రితం అరుణ్ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన మృతి చెందకముందే ఆయన వీర్యాన్ని సేకరించి కోల్‌కతా ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు. 
 
ఆ తర్వాత కొన్ని రోజులకే అరుణ్ కరోనాతో మృతి చెందారు. భర్త మరణంతో ఒంటరిగా మారిన సంగీత భర్త వీర్యం భద్రంతో ఉండటంతో దాన్ని ద్వారా సంతానం కనాలని నిర్ణయించింది. వైద్యులను సంప్రదించి విషయం చెప్పడంతో ఐపీఎఫ్‌ పద్దతిలో ఆమె అండలోకి భర్త వీర్యాన్ని ప్రవేశపెట్టారు. అలా గర్భందాల్చిన ఆమె ఈ నెల 12న రాంపూర్ హాట్‌ వైద్య కళాశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నడివయసులో బిడ్డకు జన్మనిచ్చినా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments