Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌తో భర్త మృతి - భర్త వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చిన భార్య

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (13:07 IST)
కరోనా వైరస్ మహమ్మారిబారినపడిన భర్త కన్నుమూశాడు. కానీ, అతని వీర్యంతో మృతుని భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భీర్భూమ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ్ ప్రసాద్‌ అనే దంపతులకు 27 యేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, సంగీతకు గర్భాశయ సమస్యల కారణంగా సంతానం కలగలేదు. దీంతో భర్త వీర్యంతో ఐవీఎస్ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి రెండేళ్ల క్రితం అరుణ్ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన మృతి చెందకముందే ఆయన వీర్యాన్ని సేకరించి కోల్‌కతా ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు. 
 
ఆ తర్వాత కొన్ని రోజులకే అరుణ్ కరోనాతో మృతి చెందారు. భర్త మరణంతో ఒంటరిగా మారిన సంగీత భర్త వీర్యం భద్రంతో ఉండటంతో దాన్ని ద్వారా సంతానం కనాలని నిర్ణయించింది. వైద్యులను సంప్రదించి విషయం చెప్పడంతో ఐపీఎఫ్‌ పద్దతిలో ఆమె అండలోకి భర్త వీర్యాన్ని ప్రవేశపెట్టారు. అలా గర్భందాల్చిన ఆమె ఈ నెల 12న రాంపూర్ హాట్‌ వైద్య కళాశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నడివయసులో బిడ్డకు జన్మనిచ్చినా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments