Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో మద్యం తాగించి.. స్నేహితులతో గడపమని భర్త ఒత్తిడి

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (14:15 IST)
అగ్నిసాక్షిగా మనువాడిన భార్యకు పూటుగా మద్యం తాగించి తన స్నేహితులకు పడకసుఖం ఇవ్వాలని ఓ భర్త ఒత్తిడి చేశాడు. అంతేనా... అతని ఒత్తిడికి ఆ భార్య లొంగకపోవడంతో సిగరెట్‌ పీకలతో కాల్చి చిత్రహింసలు కూడా పెట్టాడు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పుణె జిల్లా హదాప్సర్కు చెందిన 40 యేళ్ళ మహిళ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. ఇందులో భర్త ఆమె పట్ల బలవంతంగా మద్యం తాగించి, ఆ తర్వాత తన స్నేహితులతో గడపాల్సిందిగా బలవంతం చేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాకుండా, అతని డిమాండ్లకు ఒప్పుకోకపోతే భార్యను సిగరెట్ పీకలతో కాల్చి చిత్రహింసలు పెడుతున్నట్టు తెలిపింది. 
 
పైగా, కుటుంబ సభ్యులు సైతం భర్త చర్యలు మందలించకుండా వంతపాడుతూ... తననే దూషిస్తూ వేధిస్తున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వేధింపులు భరించలేక చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చినట్టు వనోవ్రీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు భర్త, అతని తల్లి, తమ్ముడు, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితులను ఇంకా అరెస్టు చేయాల్సివుంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం