Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. రెండేళ్ల పాటు అత్యాచారం.. కావాలంటే డీఎన్ఏ టెస్టు?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (17:29 IST)
ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ద్వారాహత్ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి తనపై రెండేళ్లుగా అత్యాచారం జరిపాడని, ఆయన వల్ల తనకు ఆడపిల్ల కూడా పుట్టిందని బాంబు పేల్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపుతోంది. ఐతే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఫ్యామిలీ తిప్పికొట్టింది. 
 
సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తోందని..రూ.5 కోట్లు ఇస్తే ఓకే అని, లేదంటే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరిస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డెహ్రడూన్‌లోని నెహ్రూ కాలనీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
అయితే సదరు మహిళ సాయంత్రం ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది, దీనిలో ఎమ్మెల్యే భార్య రీటా నేగి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు ఆరోపించింది. గత రెండేళ్లుగా ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఎమ్మెల్యేతో కూతురు ఉందని... తన వాదనలను నిరూపించుకోవడానికి ఆమె తన కుమార్తె, ఎమ్మెల్యేకు డీఎన్ఎ పరీక్ష చేయమని డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం