Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. రెండేళ్ల పాటు అత్యాచారం.. కావాలంటే డీఎన్ఏ టెస్టు?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (17:29 IST)
ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ద్వారాహత్ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి తనపై రెండేళ్లుగా అత్యాచారం జరిపాడని, ఆయన వల్ల తనకు ఆడపిల్ల కూడా పుట్టిందని బాంబు పేల్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపుతోంది. ఐతే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఫ్యామిలీ తిప్పికొట్టింది. 
 
సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తోందని..రూ.5 కోట్లు ఇస్తే ఓకే అని, లేదంటే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరిస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డెహ్రడూన్‌లోని నెహ్రూ కాలనీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
అయితే సదరు మహిళ సాయంత్రం ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది, దీనిలో ఎమ్మెల్యే భార్య రీటా నేగి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు ఆరోపించింది. గత రెండేళ్లుగా ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఎమ్మెల్యేతో కూతురు ఉందని... తన వాదనలను నిరూపించుకోవడానికి ఆమె తన కుమార్తె, ఎమ్మెల్యేకు డీఎన్ఎ పరీక్ష చేయమని డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం