Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి పుడుతుందనుకుంటే.. అబ్బాయి పుట్టాడు.. అంతే చంపేసింది..?

ఆడ శిశువుల భ్రూణ హత్యల గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ పూర్తి భిన్నం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కుమార్తెను కోరుకున్న ఓ తల్లి, తనకు పుట్టిన కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఆపై కుమారుడు కనిపించలేదని

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:36 IST)
ఆడ శిశువుల భ్రూణ హత్యల గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ పూర్తి భిన్నం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కుమార్తెను కోరుకున్న ఓ తల్లి, తనకు పుట్టిన కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఆపై కుమారుడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి నిజాలేంటో నిగ్గు తేల్చారు.
 
వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్ జిల్లా పైఠణ్ తహసీల్ పరిధిలోని పైఠణ్‌ ఖేడ్ గ్రామంలో దేవిక ఇరాండే అనే మహిళకు ఓ కుమారుడు ఉండగా, మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి తనకు కుమార్తె పుడుతుందని ఆమె అనుకుంది. కానీ కుమారుడే పుట్టడంతో నిరాశ చెందింది. బాలుడికి ప్రేమ్ పరమేశ్వర్ ఇరాండే అని పేరు పెట్టిన దేవిక, ఆమె భర్త, బిడ్డను పది నెలల పాటు పెంచారు.
 
ఇంతలో తన కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాగిలాల సాయంతో దేవిక ఇంటి వద్ద డ్రమ్ములోనే పిల్లాడి మృతదేహాన్ని కనుగొన్నారు. చివరకు కన్నబిడ్డను తల్లే చంపేసిందని విచారణలో వెల్లడి అయ్యింది. దీంతో దేవికను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments