Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మంచానపడ్డాడనీ... ప్రియుడితో కలిసి ఇటుకతో కొట్టి చంపేసిన భార్య...

పెళ్లయిన యేడాదికే భర్త అనారోగ్యంపాలై మంచానికే పరిమితమయ్యాడు. అలాంటి భర్తను కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్య... ప్రియుడుతో కలిసి హత్య చేసింది. అదీకూడా తలపై ఇటుకతో కొట్టి గోడకూలి చనిపోయాడంటూ కట్టుకథ అల్

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (09:14 IST)
పెళ్లయిన యేడాదికే భర్త అనారోగ్యంపాలై మంచానికే పరిమితమయ్యాడు. అలాంటి భర్తను కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్య... ప్రియుడుతో కలిసి హత్య చేసింది. అదీకూడా తలపై ఇటుకతో కొట్టి గోడకూలి చనిపోయాడంటూ కట్టుకథ అల్లింది. కానీ, పోస్టుమార్టం నివేదిక మాత్రం అది హత్య అని తేల్చడంతో భార్యతో పాటు ప్రియుడు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
 
ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. పరిశీలిస్తే, ఢిల్లీ నగరంలోని భల్స్వా డెయిరీ ప్రాంతానికి చెందిన వీరేందర్ పాండే అనే వ్యక్తికి రంజూలు అనే మహిళతో ఐదేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, పెళ్లి అయిన యేడాదికే భర్త వీరేందర్ పాండే అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. దీంతో భార్య అతన్ని ఆసుపత్రిలో చేర్పించింది. ఆ సమయంలో హరవీర్ అనే యువకుడితో రంజూకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
దీనికితోడు భర్త వైద్యం కోసం డబ్బులు చెల్లించలేక భార్య రంజూ ప్రియుడైన హరవీర్‌తో కలిసి వీరేందర్ పాండేను ఇటుకతో కొట్టి హతమార్చి, ప్రమాదవశాత్తూ గోడకూలి మరణించాడంటూ కట్టు కథ అల్లింది. వీరేందర్ పాండే తలకు దెబ్బ తగిలిందని పోస్టుమార్టం నివేదికలో తేలడంతో పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా రంజూల, హరవీర్‌లను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments