Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీతో పాటు ఆరేళ్ళ కుమార్తెపై అత్యాచారం.... ఎక్కడ?

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (17:44 IST)
దేశంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతుంది. బహిరంగ ప్రదేశాల్లోనేకాకుండా, తమ గృహాల్లో కూడా వారికి రక్షణ కరువైంది. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌ సమీపంలోని రూర్కీలో ఓ మహిళతో పాటు ఆమె కుమార్తెపై అత్యాచారం జరిగింది. ఇక్కడ కూడా హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ తరహాలోనే కారులో అత్యాచార దారుణానికి ఒడిగట్టారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, రూర్కీకి చెందిన ఓ మహిళ తన ఆరేళ్ళ కుమార్తెను తీసుకుని రాత్రివేళ పిరాన్ కిలియార్ నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ కారు డ్రైవర్ సోను కాపు ఆపివారికి లిఫ్టు ఇచ్చాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారి స్నేహితులు కూడా కారు ఎక్కారు.
 
ఆ తర్వాత మహిళతో పాటు ఆరేళ్ళ చిన్నారిపై ఆ కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత తల్లీకుమార్తెలను దుండగులు కారు వద్ద పడేశారు. ఆ తర్వాత బాధిత మహిళ అర్థరాత్రి సమయంలో సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటన గురించి వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments