Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మరో ఐదునిమిషాల్లో, పెళ్లిపీటల మీదే వధువు ఒరిగిపోయింది...

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (22:36 IST)
మరో ఐదునిమిషాల్లో పెళ్లి జరుగబోతోంది. మంగళ వాయిద్యాలతో అన్నీ సిద్ధం చేశారు. ఇక పెళ్ళి అయిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి క్షణంలో వధువు పెళ్లి పీటలపై నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు వధువును ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
 
ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా థాథియా పోలీస్ సర్కిల్ భగత్ పూర్వ గ్రామం. సంజయ్, వనితలకు పెళ్ళి నిశ్చయించారు. ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. కరోనా సమయం కావడంతో బంధువులు తక్కువ సంఖ్యలో పెళ్ళికి హాజరయ్యారు.
 
గ్రామస్తులు కూడా పెద్దగా పెళ్ళికి రాలేదు. సామాజిక దూరంతో పెళ్ళి జరుగుతోంది. మంగళ వాయిద్యాలతో మరికాసేపట్లో సంజయ్ వనిత మెడలో తాళికట్టాల్సి ఉంది. అయితే ఇంతలో ఒక్కసారిగా వనిత కిందపడిపోయింది.
 
హుటాహుటిన ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కోవిడ్ పరీక్షలు చేస్తే తప్ప ఆమెను పరీక్షించమన్నారు. అయితే కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రిలోపల అత్యవసర విభాగానికి తీసుకుని వెళ్లేలోపే ఆమె మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్థించారు. వనిత మరణంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments