మహారాష్ట్రలో వ్యాప్తిస్తున్న కరోనా.. ఒక్క రోజుల్లో రెట్టింపు కేసులు.. ఇద్దరు మృతి!

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (12:56 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా వ్యాపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక్క రోజులోనే కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య కూడా పెరిగుతోంది. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. ఒక్క మంగళవారమే ఏకంగా 155 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోల్చితే ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. అంతేకాకుండా, ఇద్దరు కరోనా బాధితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో ప్రాణాలు పోవడం చాలా కాలం తర్వాత నమోదు కావడం గమనార్హం. 
 
కాగా, మంగళవారం నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా 75 కేసులు నమోదు కాగా, ముంబై సర్కిల్‌లో 49 మందికి ఈ వైరస్ సోకింది. నాసిక్‌లో 13 కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య 81.38 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 1,48,426కు పెరిగింది. సోమవారం మహరాష్ట్రలో 61 కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
మొత్తంమీద ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా రికవరీ రేటు 98.17 శాతంగా ఉంది. మరణాల రేటు మాత్రం 1.82 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా మంగళవారం 402 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, వీటితో కలుపుకుంటే ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 4.46 కోట్లకు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments