Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలాల్లో నాట్లు వేయాల్సింది పోయి.. రోడ్లపైకి వచ్చి చలికి వణుకుతూ..?: సోనూ సూద్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (17:39 IST)
కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలిచిన హీరో సోనూసూద్ ప్రస్తుతం రైతులకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. పంజాబ్‌ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ ఆందోళనను కొనసాగిస్తున్న ఢిల్లీ రైతుల ఆందోళనపై నటుడు సోనూసూద్‌ స్పందించారు.
 
'వి ది ఉమెన్‌ ' అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్‌ మాట్లాడుతూ.. ''ఈ విషయంలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని వాదించాలనుకోవడం లేదు. అయితే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. రైతులతో నాకు మంచి అనుబంధం ఉంది. పంజాబ్‌లో పుట్టి పెరిగాను. రైతులు చేస్తున్న ఈ పోరాటంలో కొంత మంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు. పొలాల్లో నాట్లు వేస్తూ ఉండాల్సిన రైతులు .. వారి కుటుంబంతో కలిసి రోడ్లపై వచ్చి చలికి వణుకుతున్నారు. ఇంకా ఎన్నిరోజులు రైతులు ఈ పరిస్థితుల్లో ఉంటారో తెలియడం లేదు. అయితే ఈ దృశ్యాల్ని ఎప్పటికీ మరచిపోలేం'' సోనూసూద్‌ ఆవేదన చెందారు.
 
కాగా  శనివారంతో రైతుల ఆందోళన 24వ రోజుకు చేరింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, సినిమా తారలు, విపక్ష నేతలు రైతులకు మద్దతు తెలుపుతున్నారు. ఈ జాబితాలో సోనూ సూద్ కూడా చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments