Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిని లేపేస్తాం...

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (13:50 IST)
వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఒకరు హెచ్చరించారు. ఆ వ్యక్తిని రాష్ట్రంలోని యాదగిరి జిల్లా రంగంపేటకు చెందిన మొహ్మద్ రసూల్ కడారేగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బెదిరిస్తూ విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని గు్తించారు. 
 
ఫేక్‌బుక్‍‌లో షేర్ చేసిన వీడియోలో రసూల్ మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోడీ, యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించారు. అతడి చేతిలో పదునైన ఆయుధం ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అది సెల్ఫీ వీడియో అని నిందితుడు ఆ వీడియోలో మోడీ, ఆదిత్యనాథ్‌ను దుర్భాషలాడుతూ కనిపించాడని తెలిపారు. కాగా, రసూల్ హైదరాబాద్ నగరంలో దినసరికూలీగా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments