Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి తీరుతాం : అమిత్ షా

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (10:20 IST)
దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, అందరి మద్దతుతో కామల్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని తెలిపారు. 
 
పౌర ఉమ్మడి స్మతిపై జనసంఘ్ నాటి నుంచి దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటన్నారు. సరైన సమయంలో యూసీసీ తీసుకునిరావాలన్న రాజ్యాంగ అసెంబ్లీ కూడా పార్లమెంట్‌కు సూచంచిందని గుర్తుచేశారు. దేశంలో లౌకిక ప్రాతిపదికన చట్టాలు ఉండరాదు. అందరికీ ఒకే చట్టం వర్తించాలి అని అన్నారు. 
 
'రాజ్యాంగ సభ కూడా సరైన సమయం వచ్చినపుడు యూసీసీని అమలు చేయాలని సూచించింది. ఏ లౌకిక దేశమైన మతం ఆధారంగా చట్టాలు చేయలేదు. దేశం, దాని రాష్ట్రాలు సెక్యులర్ అయినప్పుడు మతం ఆధారంగా చట్టాలు ఎలా ఉంటాయి, పార్లమెంట్ ఆమోదించిన ఒకే చట్టం ఉండాలి అని ఆయన అన్నారు. 
 
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్న విమర్శలపై ఆయన స్పందించారు. ఈ సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నట్టు ఫిర్యాదులు ఉంటే కోర్టులకు వెళ్లవచ్చన్నారు. అదేసమయంలో దేశ చరిత్రను వక్రీకరించారని, దాన్ని సరి చేసేందుకు చరిత్రను తిరగరాయాలని చరిత్రకారులు సూచించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments