ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి తీరుతాం : అమిత్ షా

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (10:20 IST)
దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, అందరి మద్దతుతో కామల్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని తెలిపారు. 
 
పౌర ఉమ్మడి స్మతిపై జనసంఘ్ నాటి నుంచి దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటన్నారు. సరైన సమయంలో యూసీసీ తీసుకునిరావాలన్న రాజ్యాంగ అసెంబ్లీ కూడా పార్లమెంట్‌కు సూచంచిందని గుర్తుచేశారు. దేశంలో లౌకిక ప్రాతిపదికన చట్టాలు ఉండరాదు. అందరికీ ఒకే చట్టం వర్తించాలి అని అన్నారు. 
 
'రాజ్యాంగ సభ కూడా సరైన సమయం వచ్చినపుడు యూసీసీని అమలు చేయాలని సూచించింది. ఏ లౌకిక దేశమైన మతం ఆధారంగా చట్టాలు చేయలేదు. దేశం, దాని రాష్ట్రాలు సెక్యులర్ అయినప్పుడు మతం ఆధారంగా చట్టాలు ఎలా ఉంటాయి, పార్లమెంట్ ఆమోదించిన ఒకే చట్టం ఉండాలి అని ఆయన అన్నారు. 
 
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్న విమర్శలపై ఆయన స్పందించారు. ఈ సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నట్టు ఫిర్యాదులు ఉంటే కోర్టులకు వెళ్లవచ్చన్నారు. అదేసమయంలో దేశ చరిత్రను వక్రీకరించారని, దాన్ని సరి చేసేందుకు చరిత్రను తిరగరాయాలని చరిత్రకారులు సూచించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments