వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయి చేరుకోనుంది.. ప్రధాని మోదీ

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (13:17 IST)
త్వరలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రిషికేశ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. 35 ప్రెజర్ స్వింగ్ అబ్జార్పాన్ ఆక్సిజన్ ప్లాంట్లను ఆయన జాతికి అంకితం చేశారు.
 
పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. కోవిన్‌ ఫ్లాట్‌ఫామ్ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి ప్రపంచానికి భారత్ ఓ మార్గాన్ని చూపించిందని అన్నారు. 
 
అతి తక్కువ సమయంలోనే వైద్య సదుపాయాలు కల్పించి భారత్ తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. మూడు వేల టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, మాస్క్‌లను దిగుమతి చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. అన్ని రంగాల్లో ఎగుమతి చేసే దిశగా భారత్ దూసుకువెళ్లుందని ప్రధాని చెప్పారు.
 
దేశవ్యాప్తంగా 92 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 95 శాతం మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments